IND Vs AUS: టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ఆ ప్లేయర్తోనే హెడ్ ‘ఏక్’
నాలుగో టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. జో రూట్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానాలు దిగజారాయి. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ట్రావిస్ హెడ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు.
Updated on: Dec 25, 2024 | 6:48 PM

డిసెంబర్ 26 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా 11 మందిని ప్రకటించింది. మరోవైపు ఈ టెస్టులో టీమిండియాలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్కి వెళ్లాలంటే భారత్, ఆసీస్లకు ఈ మ్యాచ్ కీలకం.

నాలుగో టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ర్యాంకింగ్స్లో టాప్ 3 బ్యాట్స్మెన్ల ఆర్డర్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత ర్యాంకింగ్లో చాలా మార్పులు వచ్చాయి. జో రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో ఉండగా, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు.

రెండు, మూడో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్ స్థానం పెరిగింది. యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానాలు దిగజారాయి

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ట్రావిస్ హెడ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. యశస్వి జైస్వాల్ నష్టపోయి ఐదో స్థానానికి పడిపోయాడు

శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ ఆరో, దక్షిణాఫ్రికాకు చెందిన టెంబా బావుమా ఏడో, న్యూజిలాండ్కు చెందిన డారిల్ మిచెల్ ఎనిమిదో, పాకిస్థాన్కు చెందిన సౌద్ షకీల్ తొమ్మిదో, స్టీవ్ స్మిత్ పదో స్థానంలో నిలిచారు.




