కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించిన సృష్టించిన భీభత్సంలో హృదయాన్ని కదిలించే కథలు ఎన్నో.. వాటిల్లో ఒకటి ఏనుగుల గుంపు ఒక మహిళ, ఆమె కుటుంబాన్ని రక్షించడంలో ఊహించని పాత్ర పోషించింది. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాది మంది తప్పిపోయారు. అయితే భూమి మీద మెతుకు తినే అదృష్టం ఉంటే.. మృత్యువు కూడా దరి చేరదు అన్న కర్మ సిద్ధతాన్ని బాధితురాలు సుజాత విషయంలో నమ్మలిందే. సుజాత అనినచిరా, ఆమె కుటుంబం మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తన అనుభవాలను సుజాత మీడియాలో పంచుకుంది. వివరాల్లోకి వెళ్తే..