Tirumala Laddu: సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. CJIకి లేఖ రాసిన జర్నలిస్ట్‌

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నాణ్యత వ్యవహారం పెను దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రను దిగజార్చారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

| Edited By: TV9 Telugu

Updated on: Sep 25, 2024 | 11:49 AM

ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు రూ.478గా ఉంది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది. వాస్తవానికి, 2023 సంవత్సరంలో, ప్రభుత్వ డెయిరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ. 320 ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది. దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును 5 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు.

ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు రూ.478గా ఉంది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది. వాస్తవానికి, 2023 సంవత్సరంలో, ప్రభుత్వ డెయిరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ. 320 ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది. దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును 5 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు.

1 / 6
AR కంపెనీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్లను ఉపయోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి, నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదు వచ్చింది.

AR కంపెనీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్లను ఉపయోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి, నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదు వచ్చింది.

2 / 6
ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ కోరారు.

ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ కోరారు.

3 / 6
కాగా తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలను వైసీపీ తోసిపుచ్చింది.  తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వచ్చే బుధవారం ఈ పిటిషన్‌ను వింటామని హైకోర్టు తెలిపింది.

కాగా తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలను వైసీపీ తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వచ్చే బుధవారం ఈ పిటిషన్‌ను వింటామని హైకోర్టు తెలిపింది.

4 / 6
శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలు వాడారన్నారు  సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు.

శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలు వాడారన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు.

5 / 6
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా చేప నూనె, జంతువుల కొవ్వు నూనెను వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి. ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డెయిరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం (సెప్టెంబర్ 19) శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తం శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ మొదలైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా చేప నూనె, జంతువుల కొవ్వు నూనెను వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి. ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డెయిరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం (సెప్టెంబర్ 19) శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తం శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ మొదలైంది.

6 / 6
Follow us