
తిరుమల లడ్డూ ప్రసాదం
తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూలను కొనుగోలు చేసి.. తమకు తెలిసిన అందరికీ పంచిపెడుతారు. ప్రతి రోజూ తిరుమల ఆలయంలో 3.5 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతియేటా దాదాపు 12-13 కోట్ల లడ్డూలను తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ 1715 ఆగస్టు 2న ప్రారంభమయ్యింది. అంటే తిరుమల లడ్డూ మహా ప్రసాదానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగింగ్ కోసం అప్లై చేసుకోగా.. 2009లో దీనికి ఆమోదం లభించింది. 2017లో తిరుమల లడ్డూపై ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది.
లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా టీటీడీ దాదాపు రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీలో నిత్యం నిమగ్నమవుతారు. లడ్డూల దయారీ కోసం రోజూ 16 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. దీని కోసం ప్రతి ఆరు మాసాలకు ఒకసారి 36 లక్షల కేజీల నెయ్యి కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఆలయానికి సమీపంలో 85 టన్నుల నెయ్యి నిల్వ కోసం ట్యాంకును ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్లో నిర్థారణ కావడం పెను దుమారంరేపుతోంది.
Tirumala: తిరుమలలో TTD చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు
Tirumala News: తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి భవనంలో హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
- Janardhan Veluru
- Updated on: Feb 1, 2025
- 5:13 pm
Tirumala: ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
తిరుమల గిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలిపిరి, కపిలతీర్థం వద్ద వరద నీరు పరవళ్ళు తొక్కుతోంది.
- Anil kumar poka
- Updated on: Dec 15, 2024
- 6:38 pm
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్సో.. స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అంతే ఫేమస్. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన లడ్డూకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు, స్నేహితులకు బంధువులకు పంచుతారు. అందుకనే తిరుమలకు వెళ్ళినవారు స్వామివారి దర్శనం కోసం ఎంత సేపు ఎదురు చూస్తారో.. అదే విధంగా లడ్డు కొనుగోలు కోసం క్యూలో నిల్చుకుంటారు.
- Anil kumar poka
- Updated on: Dec 9, 2024
- 10:32 am
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు
వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఇలవైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించి కోనేతిరాయుడి అనుగ్రహం పొందాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత శ్రీవారి ప్రసాదం లడ్డుకి ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఎంత ఫేమసో.. శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఈ లడ్డు రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి లడ్డులను ఇక నుంచి భక్తులు కోరినన్ని ఇవ్వడానికి టీటీడీ రెడీ అవుతోంది.
- Surya Kala
- Updated on: Dec 4, 2024
- 8:48 am
Tirumala: మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై ఫోకస్..
తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం కాబోతోంది. ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడే అజెండాతో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదంటున్న టీటీడీ.. తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామంటోంది టీటీడీ.
- Anil kumar poka
- Updated on: Dec 1, 2024
- 12:03 pm
Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్!
ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సీబీఐ సిట్ బృందం టిటిడిలో సరకుల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, ల్యాబ్ లలో పరీక్షల తీరుపై వివరాలు సేకరించింది.
- Raju M P R
- Updated on: Nov 22, 2024
- 8:00 pm
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
- Jyothi Gadda
- Updated on: Nov 20, 2024
- 10:23 am
Arvind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్.. కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న సేవలో..
చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్ ఈరోజు పెద్దలు కూడా పిల్లల్లా సంతోషంగా గడపాలన్నారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేజ్రీవాల్ దంపతులు తిరుపతి విమానాశ్రయం నుంచి
- Raju M P R
- Updated on: Nov 14, 2024
- 11:29 am
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో బిగ్ బాస్ దేత్తడి హారిక.. దీప్తి సునైనా, మెహబూబ్లతో కలిసి దర్శనం .. ఫొటోస్
తెలుగు బిగ్బాస్ షో వివిధ సీజన్లలో పాల్గొన్న అలేఖ్య హారిక, దీప్తి సునైనా, మెహబూబ్ దిల్ సే, దీప్తి సునైనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
- Basha Shek
- Updated on: Nov 13, 2024
- 8:46 pm
Varun Tej: తిరుమల శ్రీవారి సేవలో వరుణ్ తేజ్ మట్కా టీమ్’.. సినిమా రిలీజ్కు ముందు స్వామివారి దర్శనం.. వీడియో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. పలాస సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (నవంబర్ 14న) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
- Basha Shek
- Updated on: Nov 13, 2024
- 6:07 pm