తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూలను కొనుగోలు చేసి.. తమకు తెలిసిన అందరికీ పంచిపెడుతారు. ప్రతి రోజూ తిరుమల ఆలయంలో 3.5 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతియేటా దాదాపు 12-13 కోట్ల లడ్డూలను తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ 1715 ఆగస్టు 2న ప్రారంభమయ్యింది. అంటే తిరుమల లడ్డూ మహా ప్రసాదానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగింగ్ కోసం అప్లై చేసుకోగా.. 2009లో దీనికి ఆమోదం లభించింది. 2017లో తిరుమల లడ్డూపై ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.

లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా టీటీడీ దాదాపు రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీలో నిత్యం నిమగ్నమవుతారు. లడ్డూల దయారీ కోసం రోజూ 16 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. దీని కోసం ప్రతి ఆరు మాసాలకు ఒకసారి 36 లక్షల కేజీల నెయ్యి కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఆలయానికి సమీపంలో 85 టన్నుల నెయ్యి నిల్వ కోసం ట్యాంకును ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్‌లో నిర్థారణ కావడం పెను దుమారంరేపుతోంది.

ఇంకా చదవండి

Asaduddin Owaisi: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది.

Tirumala Prasadam: మహాప్రసాదం మారింది.. లడ్డూతోపాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచి మారింది..!

తిరుమల లడ్డు మారింది. నెయ్యిలో నాణ్యత లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని మార్చింది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న దుమారం భక్తుల్లో ఆందోళనకు గురి చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయ్యింది. శ్రీవారి మహా ప్రసాదంలో క్వాలిటీని పెంచింది.

Prakash Raj: చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! .. ప్రకాష్ రాజ్ మరో ట్వీట్

ప్రకాష్‌రాజ్.. తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు.

Tirupati Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మరో కీలక నిర్ణయం..!

హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం. అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే అయ్యింది.

Karthi-Pawan Kalyan: కార్తీ కామెంట్‌ – పవన్ సీరియస్ రియాక్షన్.! వీడియో వైరల్..

లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశం ఇటు రాజకీయంగానూ చినికి చినికి గాలివానగా మారింది.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..

Pawan Kalyan: కార్తీ ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

Pawan Kalyan: తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..

తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. "ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు" అంటూ సమాధానం చెప్పాడు.

Sonu Sood: చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు...

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్త ఆందోళనలతో అలర్ట్‌ అయిన కేంద్రం... ఎలాంటి యాక్షన్‌కు రెడీ అయ్యింది...? సెన్సిటివ్‌ ఇష్యూని ఎలా డీల్‌ చేయనుంది.?

Tirumala Laddu: లడ్డూ ప్రసాద మాధుర్యం స్వామివారి మహిమే..! శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారు..?

తిరుమల శ్రీవారి లడ్డూ... గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశ వ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ మీద ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని కాసేపు పక్కనపెడితే.. ఇంతకీ శ్రీవారికి ఏయే నైవేద్యాలు పెడుతారు? వాటిలో లడ్డూ ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత? ఇప్పుడు చూద్దాం..

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు.

Tirupati Laddu: ఈ లడ్డూ పరమ పవిత్రం! ఈ లడ్డూ దొరకడం మహా భాగ్యం! లడ్డూ మాధుర్యం 300 ఏళ్ల నాటిది..!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా! ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని నివేదనలు శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికీ, ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డూ ప్రసాదమే!

Tirumala Laddu: సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. CJIకి లేఖ రాసిన జర్నలిస్ట్‌

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నాణ్యత వ్యవహారం పెను దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రను దిగజార్చారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tirumala Laddu: లడ్డు వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన వైసీపీ.. కీలక నిర్ణయం

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిందా..! జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీకి వాడారా..? అన్న అనుమానాలు వ్యక్తవముతున్నాయి. కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ వార్తలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ...