AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూలను కొనుగోలు చేసి.. తమకు తెలిసిన అందరికీ పంచిపెడుతారు. ప్రతి రోజూ తిరుమల ఆలయంలో 3.5 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతియేటా దాదాపు 12-13 కోట్ల లడ్డూలను తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ 1715 ఆగస్టు 2న ప్రారంభమయ్యింది. అంటే తిరుమల లడ్డూ మహా ప్రసాదానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగింగ్ కోసం అప్లై చేసుకోగా.. 2009లో దీనికి ఆమోదం లభించింది. 2017లో తిరుమల లడ్డూపై ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.

లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా టీటీడీ దాదాపు రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీలో నిత్యం నిమగ్నమవుతారు. లడ్డూల దయారీ కోసం రోజూ 16 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. దీని కోసం ప్రతి ఆరు మాసాలకు ఒకసారి 36 లక్షల కేజీల నెయ్యి కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఆలయానికి సమీపంలో 85 టన్నుల నెయ్యి నిల్వ కోసం ట్యాంకును ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్‌లో నిర్థారణ కావడం పెను దుమారంరేపుతోంది.

ఇంకా చదవండి

Tirumala Laddu Case: టీటీడీ ఉద్యోగుల్లో భయం భయం.. కల్తీ నెయ్యి కేసులో నెక్స్ట్ అరెస్టయ్యేది ఎవరు..?

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తెల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చే పనిలో ఉన్న సిట్ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 29 మంది నిందితులను కేసులో చేర్చి పలువురిని విచారించిన సిట్ 9 మందిని అరెస్టు చేసింది. మరికొద్ది మందిని నిందితులుగా చేర్చేందుకు మెమోలు దాఖలు చేసింది.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిక్కిరిసిన భక్తులతో ఆలయ వీధులు

దసరా సెలవుల తర్వాత కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వీధులు, కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న 74,861 మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ. 3.93 కోట్ల ఆదాయం లభించింది.

  • Phani CH
  • Updated on: Oct 9, 2025
  • 4:55 pm

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన నూతన వసతి గృహం 4000 మందికి వసతి కల్పిస్తుంది. ఈ భారీ వసతి గృహంలో డైనింగ్ హాల్స్, ఆర్ఓ ఫిల్టర్లు, లగేజ్ లాకర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 25న సీఎం దీన్ని ప్రారంభించనున్నారు.

  • Phani CH
  • Updated on: Sep 24, 2025
  • 11:35 am

Tirumala: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!

భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు..  దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టబయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడీ కల్తీ కుట్ర నిగ్గు తేల్చేందుకు.. ఏ13గా ఉన్న భోలేబాబా డెయిరీ మేనేజర్‌ చౌహాన్‌ కోసం వేట మొదలు పెట్టారు సిట్‌ అధికారులు. ఇంతకీ ఏయే ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగింది..?

తిరుమల వెంకన్న లడ్డూ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటున్న నకిలీగాళ్లు.. కాపీగాళ్లకు టీటీడీ చెక్!

లడ్డూలందు తిరుమల తిరుపతి లడ్డూ వేరు. దాని టేస్టు వేరు. దాని లెక్కే వేరు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదానికి ఉన్న డిమాండే వేరు. అది ప్రసాదం మాత్రమే కాదు.. కోట్ల మంది భక్తుల సెంటిమెంట్‌. మరలాంటి లడ్డూని.. మరొకరు కాపీ కొడితే వెంకన్న స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే, అలాంటివారికి దొరక్కుండా జీఐ ట్యాగింగ్‌ చేయించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు.. మాజీ చైర్మన్ పీఏను ప్రశ్నిస్తున్న అధికారులు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది.

Andhra Pradesh:శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేటి నుంచి మూడ్రోజులపాటు పలు సేవలకు బ్రేక్‌..!

ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ

TTD: వెలుగులోకి మరో మోసం.. బయటపడిన సేంద్రియ ఉత్పత్తుల బండారం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. శ్రీవారి నిత్య నైవేద్యాలు, ప్రసాదాల పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాల కోసం సరఫరా చేసిన సేంద్రియ ఉత్పత్తుల బండారం బయట పడింది.

Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారని తెలిపారు.