16వేల మొక్కలతో ఆకుపచ్చని అవతారంలో లంబోదరుడు.. అనకాపల్లిలో కనువిందు చేస్తున్న సస్య గణపతి
అనకాపల్లిలో సస్య గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించేలా మొక్కలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అంతేకాదు ఆ మండపం, పరిసర ప్రాంతాలు కూడా మొక్కలతో అలంకరించారు. చింతామణి గణపతి దత్తక్షేత్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సస్య గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
