బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తుంది.. మరొక ఆస్కార్ వచ్చేనా ??
మన నేటివ్ కథతో తెరకెక్కిన ఆస్కార్ వేదిక మీద సత్తా చాటిన తొలి సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్. హాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమా కథ మాత్రం పూర్తిగా ముంబై నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. 2008లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గురించి ఇప్పుడు మరోసారి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.
Updated on: Dec 03, 2024 | 9:08 PM

మన నేటివ్ కథతో తెరకెక్కిన ఆస్కార్ వేదిక మీద సత్తా చాటిన తొలి సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్. హాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమా కథ మాత్రం పూర్తిగా ముంబై నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. 2008లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గురించి ఇప్పుడు మరోసారి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

ముంబైలోని జుహు మురికివాడకు చెందిన పిల్లాడి కథతో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ స్లమ్డాగ్ మిలియనీర్. తన జీవిత అనుభవాలతో ఓ స్లమ్ కుర్రాడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలో ఎలా విజయం సాధించాడు అన్నదే ఈ సినిమా కథ.

2008లో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించటంతో పాటు ఆస్కార్ వేదిక మీద కూడా సత్తా చాటింది. ఈ సినిమాలోని జయహో సాంగ్కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు.

ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బ్రిడ్జ్ 7 అనే ప్రొడక్షన్ హౌస్ స్లమ్డాగ్ మిలియనీర్ సీక్వెల్ హక్కులు సొంతం చేసుకుంది. కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, స్లమ్డాగ్ మిలియనీర్ కూడా అలాంటి కథే అని అందుకే త్వరలో ఆ కథకు కొనసాగింపు తెరకెక్కించబోతున్నామన్నారు.

తొలి భాగంలో భారతీయ మూలాలున్న హాలీవుడ్ నటులు దేవ్ పటేల్, ఫ్రిదా పింటోతో పాటు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. మరి సీక్వెల్లో ఈ పాత్రలను కంటిన్యూ చేస్తారా...? లేదా ఆ థీమ్ను మాత్రమే తీసుకొని కొత్త నటీనటులతో సినిమా రూపొందిస్తారా అన్నది చూడాలి.




