ఈ గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగారంటే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరగాల్సిందే!
ఆరోగ్యకరమైన ఆహారం మన వంటింట్లోనే ఉన్నా.. మనమే వాటిని అశ్రద్ధ చేస్తుంటాం. ముఖ్యంగా ఎల్లప్పుడూ మనకు అందుబాటులోనే ఉండే సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఉండే పోషకాలే అందుకు కారణం. కాసిన్ని సోంపు గింజలు తీసుకోని అందులో..
Updated on: Aug 27, 2025 | 8:49 AM

లవంగాలలో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. లవంగాలు దంతాలు, చిగుళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అందువల్ల మీరు భోజనం తర్వాత లవంగాలను కూడా తినవచ్చు.

భోజనం తర్వాత పుదీనా ఆకులను తినవచ్చు. పుదీనా ఆకులు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత 2-3 పుదీనా ఆకులను నోటిలో ఉంచుకోవడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది. అయితే ఆమ్లత్వంతో బాధపడేవారు నిపుణుడిని సంప్రదించకుండా పుదీనా ఆకులను తినకూడదు.

సోంపు గింజలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మందికి భోజనం తర్వాత సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి కూడా వీటిని తీసుకుంటారు.

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు జీర్ణక్రియను మెరుగుపడుతుంది. అదే విధంగా రాత్రంతా నానబెట్టిన సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సోంపు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

భోజనం తర్వాత కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆమ్లత్వం తగ్గుతుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను సజావుగా చేయడంలో, ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.




