దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు ఇవే..! ఒక్కో స్టేషన్‌కి ఒక్కో చరిత్ర.. తెలుసుకోండి..

Most Haunted Railway Stations : రోజూ కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లే భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు

దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు ఇవే..! ఒక్కో స్టేషన్‌కి ఒక్కో చరిత్ర.. తెలుసుకోండి..
Most Haunted Railway
Follow us

|

Updated on: May 19, 2021 | 9:52 PM

Most Haunted Railway Stations : రోజూ కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లే భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారతీయ రైల్వే ప్రకారం అన్ని పెద్ద, చిన్న రైల్వే స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య 7349. ఇది కాకుండా దేశంలోని అనేక ఇతర ప్రదేశాలలో రైల్వే స్టేషన్లను నిర్మించటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటితో పాటు అనేక ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో కొత్త రైల్వే స్టేషన్ల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశంలోని మొత్తం రైల్వే స్టేషన్లలో కొన్ని భయంకర రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయ. ఈ రోజు మనం దేశంలో అత్యంత భయంకరమైన 5 రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం.

1. బేగున్‌కోదర్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న బేగున్‌కోదర్ రైల్వే స్టేషన్ ఒక డేంజర్ కథను కలిగి ఉంది. ఇది దేశంలో అత్యంత భయపడే రైల్వే స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు తెల్లని చీర ధరించిన ఆడ దెయ్యాన్ని చూశారని చెప్పారు. ఇది కాకుండా ఈ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఇంకా చాలా భయానక కథలు ఉన్నాయి. స్టేషన్‌కు సంబంధించిన ఈ దెయ్యాల వాదనల కారణంగా ఇది 42 సంవత్సరాలు మూసివేయబడింది. ఏదేమైనా ఇది 2009 సంవత్సరంలో మరోసారి సేవలు ప్రారంభించారు.

2. బరోగ్ రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఉన్న బరోగ్ రైల్వే స్టేషన్ కూడా దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. కల్కా-సిమ్లా రైలు మార్గంలో వస్తున్న ఈ చిన్న రైల్వే స్టేషన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ పక్కన ఒక సొరంగం ఉంటుంది. దీనిని బరోగ్ టన్నెల్ అంటారు. వాస్తవానికి ఈ సొరంగం కల్నల్ బరోగ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ నిర్మించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్నల్ బరోగ్ ఆత్మ బరోగ్ సొరంగంలో తిరుగుతున్నట్లు చెబుతారు.

3. చిత్తూరు రైల్వే స్టేషన్ అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఒకప్పుడు సిఆర్‌పిఎఫ్ జవాన్ హరి సింగ్ ఈ స్టేషన్‌లోకి దిగినట్లు ప్రజలు చెప్పారు. రైలు దిగిన తరువాత అతన్ని ఆర్‌పిఎఫ్, టిటిఈ కలిసి కొట్టాయి. అతను మరణించాడు. అప్పటి నుంచి సిఆర్పిఎఫ్ జవాన్ హరి సింగ్ ఆత్మ న్యాయం కోసం ఈ రైల్వే స్టేషన్ వద్ద తిరుగుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

4. ములుంద్ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ములుంద్ రైల్వే స్టేషన్ దేశంలోని దెయ్యం రైల్వే స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రైల్వే స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ప్రజలు ఏడుస్తూ, అరుస్తున్న శబ్దాలను విన్నామని చెబుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటుతూ మరణించిన వారు దెయ్యాలుగా మారారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

5. నైని రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో ఉన్న నైని జంక్షన్ రైల్వే స్టేషన్‌ను భూతియా అని కూడా అంటారు. రైల్వే స్టేషన్ సమీపంలో నైనీ జైలు కూడా ఉంది. దేశ స్వాతంత్ర్యానికి విశేషంగా సహకరించిన చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు ఈ జైలులో మూసివేయబడ్డారు. వారు ఇక్కడ అనేక రకాల భయంకరమైన హింసలను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక మంది జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధులు హింస కారణంగా చంపబడ్డారు. అదే స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలు ఈ రైల్వే స్టేషన్‌లో తిరుగుతాయని చెబుతారు.

సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్న తమిళియన్స్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ పై మండిపడుతున్న ఆడియన్స్..

రైలు చివరన X అని ఎందుకు రాస్తారు..! చిన్న బోర్డుపై ఉండే LV అక్షరాల అర్థం ఏంటి..? తెలుసుకోండి..

‘నీకు ఇదేం వినోదం తల్లీ ? సిగ్గు ! సిగ్గు !’ టీవీ నటి దీపికా సింగ్ పై నెటిజన్ల ఫైర్, ఆమె ఏం చేసిందో చూస్తే షాక్ తినాల్సిందే మరి !

Latest Articles