Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!

నాగార్జున యూనివర్సిటీ అధికారుల నిర్వాకానికి విద్యార్థుల మైండ్ బ్లాక్ అయింది. పరీక్షా హాల్లో ఇచ్చి ప్రశ్నాపత్రం చూసి ఏంటిది..! అనుకుంటూ మనసులోనే చాలా సేపు మదనపడిపోయారు..

Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!
Exams
Follow us

|

Updated on: Jul 24, 2021 | 12:22 PM

Degree semester Exam : నాగార్జున యూనివర్సిటీ అధికారుల నిర్వాకానికి విద్యార్థుల మైండ్ బ్లాకైంది. పరీక్షా హాల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రం చూసి ఏంటిది..! అనుకుంటూ మనసులోనే చాలా సేపు మదనపడిపోయారు. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంచేసుకోవాలో కొంతసేపు అర్థంకాలేదు. అంతర్మధనం అనంతరం దిక్కులు చూడ్డం మొదలెట్టారు. కట్ చేస్తే, నెమ్మదిగా విషయం బోధపడింది. యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు.. మూడో సెమిస్టర్ పేపర్ ఇచ్చారని అవగతమైంది. దీంతో పరీక్ష రాయకుండా ఖాళీగా కూర్చున్నారు విద్యార్థులు.

దీనిపై నాగార్జున యూనివర్శిటీ పరీక్షల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రెడ్డి సావధానంగా స్పందించారు. పేపర్ విడుదలలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనన్నారు. సాంకేతిక పరంగా జరిగిన పొరపాటు వల్ల మొదటి సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేశామని తేల్చారు. ఆగస్టు 11వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహిస్తామని వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.

మూలాల్లోకి వెళితే, నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ తెలుగు పేపర్‌ పరీక్షల్లో ఇవాళ గందరగోళం నెలకొంది. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్‌కు బదులుగా మూడో సెమిస్టర్ పేపర్‌ను ఇవ్వడంతో విద్యార్ధులు అయోమయానికి గురయ్యారు. అవుటాఫ్‌ సిలబస్‌తో క్వశ్చన్‌ పేపర్‌ వచ్చిందంటూ పరీక్ష రాయలేకపోయారు. ఇన్విజలేటర్లు వెంటనే ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియచేశారు. అయితే, వచ్చినంత వరకు పేపర్‌ను అటెండ్ చేయాలని తెలిపిన యూనివర్సిటీ అధికారులు.. అనంతరం ఈరోజు పరీక్షను రద్దు చేసి ఆగస్టు 11వ తేదిని తిరిగి నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రకాశంజిల్లాలో మొత్తం 6 సెంటర్లలో 40 వేలమంది విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోన్న డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు జరుగుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు పేపర్‌ పరీక్షలో చదువుకున్న సబ్జెక్టుకు, పరీక్ష పేపర్ లోని లోని ప్రశ్నలకు పొంతన లేకపోవడంతో విద్యార్ధులు అయోమయానికి గురయ్యారు.

తాము పరీక్ష రాయలేకపోయామని, జరిగిన పొరపాటును గుర్తించి యూనివర్శిటీ అధికారులు తిరిగి పరీక్షను నిర్వహించాలని విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు కోరారు. అలాగే గతంలో కూడా తప్పులు చేస్తూ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న యూనివర్శటీ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పేపర్ విడుదలలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని గుర్తించిన అధికారులు, ఇది సాంకేతిక పరంగా జరిగిన పొరపాటుగా చెబుతున్నారు. మొదటి సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేశామని, ఆగస్టు 11వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహిస్తామని పరీక్షల కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి ప్రకటించారు.

దీంతో ఈ రోజు నిర్వహించిన డిగ్రీ ఫస్ట్‌ఇయర్‌ తెలుగు మొదటి సెమిస్టర్‌ పరీక్ష రద్దయినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఒంగోలుతో పాటు గుంటూరు, ప్రకాశంజిల్లా పరిధిలో ఈరోజు పరీక్షలు రాసిన విద్యార్ధులకు న్యాయం చేస్తామని యూనివర్శిటీ అధికారులు ప్రకటించారని ఒంగోలు శర్మ కాలేజి ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు టీవీ9 కి తెలిపారు.

Exams Guntur

Exams Guntur

Read also :  Adilabad : నిర్మల్‌జిల్లాలో వరద బీభత్సం, పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే.. బాధితుల ఆగ్రహావేశాలు

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు