Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

నల్లా నీళ్లు తాగడం వల్ల కరోనా వ్యాపిస్తుందని వస్తోన్న దుష్ప్రచారాలను తిప్పికొట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). మంచినీటి పైపుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతోన్న ప్రచారాన్ని తిప్పి..

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 03, 2020 | 12:55 PM

నల్లా నీళ్లు తాగడం వల్ల కరోనా వ్యాపిస్తుందని వస్తోన్న దుష్ప్రచారాలను తిప్పికొట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). మంచినీటి పైపుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతోన్న ప్రచారాన్ని తిప్పి కొట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ మంచినీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉంటే ‘ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీరు తొగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించవద్దని.. ఇజ్రాయోల్ నుంచి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం’ జరుగుతోంది. దీన్ని తీవ్రంగా తప్పు పట్టింది డబ్ల్యూహెచ్‌వో. ఇజ్రాయోల్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ సంఖ్యకు, తాగునీటికి సంబంధం లేదని WHO ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు. కేవలం మనిషిని మరో మనిషి తాకడం, కరోనా వచ్చిన పేషంట్లు వాడిన వస్తువులను వాడటం, తాకడం ద్వారా ఈ వైరస్ వస్తుందే తప్ప.. గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటిది కాదన్నారు. కాగా.. కరోనా వైరస్ ప్రబలుకుండా ఉండాలంటే మనిషికి.. మనిషికి మధ్య మీటర్ దూరం ఉండాలని, ముఖ భాగాలను తాకకపోవడం వంటి చర్యల ద్వారానే కరోనా వైరస్‌ని నియంత్రించవచ్చారు.

ఇవి కూడా చదవండి:

 ఫ్లాష్‌న్యూస్: దేశ వ్యాప్తంగా 2,301కి చేరిన కరోనా కేసులు..

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం