Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్‌. సంక్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలను అందిస్తున్న..

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 02, 2020 | 2:36 PM

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్‌. సంక్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలను అందిస్తున్న వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఊరికే వదలమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు కేటీఆర్‌.

కాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్‌రూమ్‌లో జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్, డాక్టర్లపై, స్టాఫ్‌పై దాడికి పాల్పడ్డారు. ఐసోలేషన్ వార్డులోని కిటికీ అద్దాలను, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి:

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం

ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే

లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం

కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ