తిరుపతిలో కరోనా టెన్షన్.. మర్కజ్ ఇష్యూ ఒక వైపు.. ఇస్తేమా సమస్య మరోవైపు..!

ఏపీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో మర్కజ్‌ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలు ఏపీ నుంచి కూడా వెళ్లి రావడంతో వారిలో పలువురికి ఈ వైరస్ ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో తిరుపతి కార్పోరేషన్ మొత్తం అప్రమత్తమైంది. గత మార్చి 13 నుంచి 22 […]

తిరుపతిలో కరోనా టెన్షన్.. మర్కజ్ ఇష్యూ ఒక వైపు.. ఇస్తేమా సమస్య మరోవైపు..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 2:07 PM

ఏపీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో మర్కజ్‌ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలు ఏపీ నుంచి కూడా వెళ్లి రావడంతో వారిలో పలువురికి ఈ వైరస్ ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో తిరుపతి కార్పోరేషన్ మొత్తం అప్రమత్తమైంది. గత మార్చి 13 నుంచి 22 వరకు ఢిల్లీ నుంచి తిరుపతికి అన్ని ట్రైన్‌లలో చేరుకున్నప్రయాణికుల వివరాలు సేకరించారు. ముఖ్యంగా జమాత్ సమావేశాలకు వెళ్లిన వారి కోసం ఇంటింటి సర్వే కొనసాగుతోంది. తిరుపతి నుంచి ఢిల్లీ తబ్లిగీ జమాత్‌కు ఆరుగురు వెళ్లినట్లు గుర్తించారు. ఇక పాజిటివ్ కేసు నమోదైన త్యాగరాజు నగర్‌ ప్రాంతంలోని ఆరువార్డులను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. అక్కడ ఉన్న 80వేల ఇళ్లను ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. రెండు కిలోమీటర్ల వరకు రాకపోకలపై ఆంక్షలు విధించామని. పోలీసులు కార్డన్‌ సర్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. అస్సాంలో జరిగిన ఇస్తేమాతో కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో 18,19 తేదీల్లో అస్సాం రాష్ట్రంలోని గోల్‌పరాలోని మసీదులో జరిగిన ఇస్తెమాకు తిరుపతి నుంచి కొందరు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అస్సాంకు ఎవరెవరు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం నుంచి అస్సాంకు 12 మంది వెళ్లారని.. వారిలో ముగ్గురికు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు కూడా అస్సాం వెళ్లి వచ్చిన వారేనని అధికారులు తేల్చారు. అంతేకాదు..బెంగుళూరు, చెన్నైలలో జరిగిన సభలలో కూడా మరో 121 మంది పాల్గొన్న వారిని అధికారులు గుర్తించారు. వీరందరి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు అధికారులు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు