బాల‌య్య ఇలాకాలో క‌రోనా…క్వారంటైన్ నుంచి 29 మంది డిశ్చార్జి

ఏపీలో క‌రోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ విస్త‌రిస్తూ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. గంట‌గంట‌ల‌కు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ..ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతోంది. కాగా, అనంత‌పురంలో క‌రోనా నుంచి ..

బాల‌య్య ఇలాకాలో క‌రోనా...క్వారంటైన్ నుంచి 29 మంది డిశ్చార్జి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 1:39 PM

ఏపీలో క‌రోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ విస్త‌రిస్తూ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. గంట‌గంట‌ల‌కు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ..ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతోంది. కాగా, అనంత‌పురంలో క‌రోనా నుంచి కాస్తా ఊర‌ట క‌లిగించే విష‌యం వెలుగుచూసింది. క్వారంటైన్‌లో ఉన్న 29 మందిని డిశార్జ్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మ‌రో ఇద్దరు బాధితులు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. హిందూపురంలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడు, హిందూపురానికి చెందిన మహిళ కోలుకుంటున్నారని డాక్టర్‌ కేశవులు తెలిపారు. వారి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోందన్నారు.

కాగా, ఆస్పత్రిలోని క్వారంటైన్‌లో ఉన్న 29 మందిని గురువారమే డిశ్చార్జ్‌ చేసినట్లు డాక్టర్ చెప్పారు. వీరందరినీ మార్చి 22 నుంచి క్వారంటైన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తూ వచ్చామని, తాజాగా వారికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలడంతో వారిని ఇళ్లకు పంపినట్లు వివరించారు. అయినప్పటికీ వారంతా ఈ నెల 12వ తేదీ వరకు ఇళ్లలోనే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇక మలుగూరుకు చెందిన ఓ వ్యక్తిని మాత్రం ఈ నెల 25 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించినట్లు డాక్టర్‌ కేశవులు తెలిపారు.