AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దారుణం.. కూతురు కంటే ఎక్కువ మార్కులొచ్చాయని ఘాతుకం.. స్కూల్ టాపర్‌‌ను చంపిన తల్లి..

కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌- మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు.

Crime: దారుణం.. కూతురు కంటే ఎక్కువ మార్కులొచ్చాయని ఘాతుకం.. స్కూల్ టాపర్‌‌ను చంపిన తల్లి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2022 | 11:59 AM

Share

Woman killed student: పుదుచ్చేరిలో దారుణం జరిగింది. తన కూతురి కంటే ఓ విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఏకంగా హత్య చేయించింది ఓ స్టూడెంట్‌ తల్లి. కూల్‌డ్రింక్‌లో విషం ఇచ్చి బాలుడిని కడతేర్చింది. ఈ ఘటన పుదుచ్చేరిలో సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ క్రైమ్‌ స్టోరీ వెలుగులోకి వచ్చింది. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌- మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే, స్కూలుకు వెళ్లొచ్చిన తర్వాత వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. మణికందన్‌ను కారైకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కూల్‌ డ్రింక్‌లో విష పదార్థాలు ఉన్నాయని తేలడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ టీవీ కెమెరాను పరిశీలించిన అనంతరం అసలు కథ బయటపడింది. విక్టోరియా అనే మహిళ ఈ విష ప్రయోగానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కూతురి కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడిందని.. పోలీసుల విచారణలో తేలింది. స్కూల్‌లో ఉండే వాచ్‌మెన్‌ ద్వారా మణికందన్‌కు విషంతో ఉన్న కూల్‌డ్రింగ్‌ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. తన కొడుకు క్లాస్‌ ఫస్ట్‌ రాకపోవడానికి మణికందన్‌ కారణమని భావించి ఈ ఘాతుకానికి పాల్పడింద్నారు. దీంతో నిందితురాలు సహాయరాణి విక్టోరియాను కారైకాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, పోలీస్టేషన్‌కు తరలించారు.

అయితే.. ఉదయం 11:00 గంటల సమయంలో విద్యార్థి బయటకు రాగా.. డ్యూటీలో ఉన్న వాచ్‌మెన్ తో బాల మణికందన్‌కు కూల్ డ్రింక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాల మణికందన్ తన కూతురు కంటే బాగా చదువుతున్నాడని, ప్రస్తుత పరీక్షలో క్లాస్ ఫస్ట్ రావడంతో ఈ దారుణానికి పాల్పడిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!