AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhupender Yadav: ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 28 కోట్ల మంది.. ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంపై కీలక నిర్ణయం: TV9 గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి భూపేంద్ర యాదవ్‌

Bhupender Yadav: TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, పర్యావరణ శాఖ..

Bhupender Yadav: ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 28 కోట్ల మంది.. ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంపై కీలక నిర్ణయం: TV9 గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి భూపేంద్ర యాదవ్‌
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 19, 2022 | 9:36 PM

Share

Bhupender Yadav: TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పాల్గొని ప్రసంగించారు. దేశంలో పేదలకు, కార్మికులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దాదాపు 28 కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని ఆయన అన్నారు. జూలై 1 నుంచి 120 మిల్లీ లీటర్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యతగా ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నేడు భారత దేశంలోని 90 శాతం శ్రామిక శక్తి అసంఘటిత రంగానికి చెందింది. కానీ వారికి ఏదైనా సామాజిక భద్రతా పథకం ప్రయోజనాలను అందించడానికి విధానాలను అమలు చేయడానికి డేటా ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులందరి డేటా సేకరించినట్లు చెప్పారు.

కీలక రంగాలలో ఉద్యోగాలకు డిమాండ్‌..

తొమ్మిది కీలక రంగాలలో ఉద్యోగాలకు ఎంతో డిమాండ్‌ పెరుగుతుందని, వాటిలో వ్యవసాయం ఒకటని తెలిపారు. అసంఘటిత రంగాలలో ఉపాధి నిరంతరం పెరుగుతోందన్నారు. గత ఏడాది వ్యవసాయ కాకుండా మరో తొమ్మిది రంగాలలో డిమాండ్‌ పెరుగుతోందన్నారు.

ఇవి కూడా చదవండి

అందరికీ కార్మిక రక్షణ కల్పిస్తున్నాం:

దేశంలో ఉపాధికి సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. 18 నెలల తర్వాత 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అప్పుడే ప్రకటించారు. దీనిపై విపక్షాలు గతంలో కోట్ల గురించి మాట్లాడేవారని, ఇప్పుడు లక్షల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధి పెరిగిందన్నారు. పీఎఫ్‌ గణాంకాలు చూస్తే అందులోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ విధంగా ఉత్పాదకత పెరిగింది, వ్యవసాయం కాకుండా, ఐటి, రవాణా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్ వంటి తొమ్మిది రంగాలలో ఉపాధి పెరిగిందని తెలిపే అనేక సూచికలు ఉన్నాయని భూపేంద్రయాదవ్‌ అన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ కార్మిక రక్షణ కల్పిస్తున్నాం అని అన్నారు.

అగ్నిపథ్ పథకంపై ఆలోచించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అగ్నిపథ్ పథకాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించారు. ఈ నిరసన సబబు కాదన్నారు. ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది యువతకు ఎంతో మేలు చేస్తుంది. ఇది సైన్యాన్ని బలోపేతం చేస్తుంది. యువకులు సైన్యంలోకి వస్తారు. ఇది ఒక రకమైన విలువ జోడింపు. అలాగే, సైన్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉపాధికి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై..

ఉపాధికి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగాలలో ఉపాధిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నం కొనసాగుతోందని అన్నారు. భారతదేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధి పెరిగిందని, త్వరలో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేస్తామని అనేక సర్వేలు చెబుతున్నాయి.

వాతావరణ మార్పుల అంశంపై భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. పారిస్ ఒప్పందంలో అన్ని దేశాలు తమ లక్ష్యాలను తెలిపాయని అన్నారు. భారత్ కూడా లక్ష్యాలను నిర్దేశించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సారథ్యంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ముందుగానే సాధించిన ప్రపంచంలోని దేశాల్లో భారత్‌ ఒకటి అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి