AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపైకి ఎక్కిన ట్రక్కు! ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

ట్రక్కు డ్రైవర్‌ చేసిన ఘోర తప్పిదానికి ఓ నిండు కుటుంబం బలైపోయింది. రాజస్థాన్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై యు-టర్న్ తీసుకుంటున్న ట్రక్కు అటుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం..

Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపైకి ఎక్కిన ట్రక్కు! ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
Road Accident
Srilakshmi C
|

Updated on: May 08, 2024 | 4:36 PM

Share

సవాయి మాధోపూర్, మే 8: ట్రక్కు డ్రైవర్‌ చేసిన ఘోర తప్పిదానికి ఓ నిండు కుటుంబం బలైపోయింది. రాజస్థాన్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై యు-టర్న్ తీసుకుంటున్న ట్రక్కు అటుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్స్‌ప్రెస్‌వేలోని సిసిటివి ఫుటేజీలోని వీడియో ప్రకారం..

సికార్ జిల్లా నుంచి రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి ఓ కుటుంబం కారులో బయల్దేరింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని బనాస్‌ నది వంతెన సమీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపైకి వచ్చింది. అయితే అదే సమయంలో ఓ ట్రక్కు రోడ్డుపై యూటర్న్‌ తీసుకుంటుంది. ముందు వెళ్తున్న ఆ ట్రక్కు ఒక్కసారిగా రాంగ్‌ యూ టర్న్‌ తీసుకోవడంతో దాని వెనుక వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. అనంతరం కారుపైకి ట్రక్స్‌ ముందు భాగం ఎక్కింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్‌ పరార్‌ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మృతులను మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్‌గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అదే రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ దియా కుమారి సంతాపం తెలిపారు. ‘సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బౌన్లీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మరణించారనే వార్త చాలా బాధాకరమైనది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు’ భజన్‌లాల్ శర్మ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!