Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Video: బీహార్‌ ప్రచారంలో అపశృతి.. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం! వీడియో

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం (మే 27) పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని పాలిగంజ్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్‌జేడీ నాయకులు తేజస్వి యాదవ్, RJD అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి ఉన్నారు. వేదికపై రాహుల్‌ గాంధీ నిలబడి ఉన్న చోట స్టేజ్‌ నేలపైకి కూలబడింది. ఆ సమయంలో..

Rahul Gandhi Video: బీహార్‌ ప్రచారంలో అపశృతి.. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం! వీడియో
Rahul Gandhi
Srilakshmi C
|

Updated on: May 27, 2024 | 6:02 PM

Share

పాలిగంజ్‌, మే 27: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం (మే 27) పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని పాలిగంజ్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్‌జేడీ నాయకులు తేజస్వి యాదవ్, RJD అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి ఉన్నారు. వేదికపై రాహుల్‌ గాంధీ నిలబడి ఉన్న చోట స్టేజ్‌ నేలపైకి కూలబడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ కొంతసేపు బ్యాలెన్స్ కోల్పోయారు. ఘటన జరిగినప్పుడు మిసా భారతి రాహుల్‌ గాంధీ చేయి పట్టుకుని ఆయనను బ్యాలెన్స్‌ చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది తనను దిగిపోవాలని కోరినప్పటికీ, రాహుల్‌ వారికి భరోసా ఇచ్చి ర్యాలీని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బీహార్‌లో ప్రధాని మోదీ బ్యాక్-టు-బ్యాక్ ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరని, దేశవ్యాప్తంగా భారత కూటమికి బలమైన మద్దతు ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు. భారత కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. 2022లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో ‘అగ్నివీర్స్’ అని పిలవబడే యువ సైనికులను నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకుని, 75% మంది ప్రామాణిక సైనిక ప్రయోజనాలు లేకుండా పదవీ విరమణ చేస్తున్నారు. భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అగ్నిపథ్ పథకాన్ని తొలగిస్తుందని’ రాహుల్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

“మోదీ సైనికులను కార్మికులుగా మార్చారు. మోదీ సైన్నాన్ని రెండు వర్గాలుగా చేశారు. యుధ్ధంలో ఒక అగ్నివీర్ గాయపడినా లేదా అమరవీరుడు అయినా.. అతనికి అమరవీరుడు హోదా, పరిహారం లభించదు. ఎందుకు ఈ వివక్ష? అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు. మోదీ తనను ‘దేవుడు పంపాడు’ అనే వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. జూన్ 4 తర్వాత మోదీ ప్రభుత్వం అవినీతి గురించి ED ప్రశ్నిస్తే.. తనకు ఏమీ తెలియదని.. తనను దేవుడే పంపాడని చెబుతాడని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత భారత కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మూతపడిన అన్ని పరిశ్రమలను తెరుస్తుందని, 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.