AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi: 70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం.. హర్షం వ్యక్తం చేస్తోన్న ముస్లింలు..

పవిత్ర పుణ్య క్షేత్రం కాశీలో 70 ఏళ్లుగా మూతపడిన సిద్ధీశ్వర మహాదేవ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. స్థానిక ముస్లింల సహకారంతో అధికారులు బుధవారం ఆలయ తాళాన్ని తెరిచారు. మకర సంక్రాంతి తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించి సంప్రోక్షణ చేయనున్నారు. అన్నపూర్ణ దేవాలయ ఆధ్వర్యంలో పూజలకు ఏర్పాట్లు చేయనున్నారు.

Kashi: 70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం.. హర్షం వ్యక్తం చేస్తోన్న ముస్లింలు..
Siddheshwar Mahadev Temple
Surya Kala
|

Updated on: Jan 08, 2025 | 8:48 PM

Share

వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయం తాళం తెరిచారు. భారీ పోలీసు బలగాల సమక్షంలో ఆలయ శుద్ధి ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వారణాసి ఏడీఎం సిటీ అలోక్ వర్మ 70 ఏళ్లుగా మూతపడిన సిద్ధీశ్వర మహాదేవ ఆలయ తాళాన్ని తెరిచారు. స్థానిక ముస్లింలు కూడా పరిపాలన అధికారులకు సహకరించి శాంతిభద్రతలను కాపాడారు. ఆలయం లోపల రెండు-మూడు విరిగిన శివలింగాలు కనిపించాయి.. అయితే సిద్దీశ్వర్ మహాదేవుని శివలింగం అక్కడ లేదు.

సనాతన మతంలో ఈ ప్రదేశానికి ప్రాముఖ్యత ఉంది. శివలింగం కనిపించకపోయినా.. కొత్త శివలింగాన్ని ప్రతిష్టించే సనాతన సంప్రదాయం ఉంది. ఆలయాన్ని తెరిచినప్పుడు శిథిలాలు తొలగించి గర్భగుడిని గంగాజలంతో శుద్ధి చేశారు. అనంతరం అధికారులు ఆలయానికి తాళం వేశారు. ‘ధుంధే కాశీ’ ప్రజలు అక్కడికి చేరుకుని ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ స్మరించుకున్నారు. ఖర్మల అనంతరం ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, పవిత్రం కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి శ్రీ కాశీ విద్వత్ పరిషత్ రెండు మూడు రోజుల్లో ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.

శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి

ఈ ఆలయంలో ప్రధాన శివలింగమైన సిద్దీశ్వర మహదేవ ఆచూకీ లభించలేదని ‘ధుంధే కాశీ’ సంస్థకు చెందిన అజయ్ శర్మ తెలిపారు. అవి దొరకకున్నా మకర సంక్రాంతి తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించనున్నామని చెప్పారు. శ్రీ కాశీ విద్వత్ పరిషత్, అన్నపూర్ణ దేవాలయం సహాయంతో ఇక్కడ శిలా శివలింగ రూపంలో ఉండే సిద్ధీశ్వర్ మహాదేవుని ప్రతిష్టించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఏడు రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి అనంతరం ఇద్దరు అర్చకులను నియమిస్తామని శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ నారాయణ్ ద్వివేది తెలిపారు. పూజారుల నియామకం బాధ్యతను అన్నపూర్ణ దేవాలయం నిర్వహిస్తుంది. శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు ప్రారంభంకానున్నాయని చెప్పారు.

అన్నపూర్ణ ఆలయం నుంచే రాజ్ భోగ్ ఏర్పాటు

కలియుగంలో కాశీ అన్నపూర్ణ సకల జీవులకు ఆకలి తీచే అమ్మ. కనుక ఈ ఆలయంలో రాగ భోగ ఏర్పాటు బాధ్యతను అన్నపూర్ణ ఆలయానికి మాత్రమే అప్పగించారు. ఆలయ నిర్వహణ వైదిక పద్ధతిలో జరుగుతుందని త్రికాల సంధ్య పద్ధతిలో పూజలు ఉంటాయని చెప్పారు.

ఇక్కడ పూజలు చేయడం తమకు అభ్యంతరం లేదన్న ముస్లింలు

సిద్ధేశ్వర మహాదేవ ఆలయాన్ని తెరిచే విషయంలో స్థానిక ముస్లింల నుంచి మంచి మద్దతు లభించింది. మదన్‌పురాకు చెందిన గోల్ చబుత్రా ముస్లింలు ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. శాంతి యుతంగా అందరూ కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఇది మాకు మరో అవకాశం. మేము ఆలయం చుట్టూ ఉన్నందున, పూజ సామగ్రి, పూల దండలు విక్రయించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని చెప్పారు. భక్తుల రాకతో చీరల అమ్మకాలు కూడా పెరుగుతాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..