AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dowry Murder: అడిగినంత కట్నం తీసుకురాలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..

Dowry Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో...

Dowry Murder: అడిగినంత కట్నం తీసుకురాలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..
Man Shoots Wife
Shiva Prajapati
|

Updated on: Jun 02, 2021 | 9:16 AM

Share

Dowry Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఘజియాబాద్‌లోని సిహానీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సిహాని గ్రామానికి చెందిన కుల్దీప్ అలియాస్ మింటూతో ముజఫర్ నగర్‌ జిల్లాలోని ఉపవాలి గ్రామానికి చెందిన సారికతో గత ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహం జరిగింది. అయితే, కట్నం తగినంత తీసుకురాలేదనే ఆగ్రహంతో మింటూ తన భార్యను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అయితే, ఈ వేధింపులు తాలలేక నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు.

ఇదిలాఉంటా.. మంగళవారం సాయంత్రం సమయంలో కట్నం విషయంలోనే మింటూ తన భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రం అవడంతో ఆగ్రహానికి గురైన మింటూ తుపాకీతో తన భార్యపై కాల్పులు జరిపాడు. దాంతో సారికా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. భార్యను హతమార్చిన మింటూ తన తల్లిదండ్రులతో కలిసి పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, మింటూపై గతంలోనే హత్య కేసు ఉందని, ఈ కేసులో అతను అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసు అధికారులు తెలిపారు. తాజాగా అతనిపై హత్యానేరంతో పాటు ఆయుధ నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్ల జిల్లా పోలీసు అధికారి అగర్వాల్ వెల్లడించారు.

Also read:

Skin black fungus: మ‌రో టెన్ష‌న్… ‘స్కిన్​ బ్లాక్​ ఫంగస్​’…. దేశంలో ఫ‌స్ట్ కేసు న‌మోదు..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై