AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం, విరిగిపడుతున్న కొండచరియలు.. ఇద్దరు మహిళలు మృతి..

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి. నిద్రలో ఉన్న తల్లి , కూతురు ప్రాణాలు కోల్పోయారు.42 ఏళ్ల మహిళ, ఆమె 15 ఏళ్ల శిధిలాల కింద పడి మరణించారు. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర మార్గం ఉత్తరకాశీ సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), స్థానిక యంత్రాంగం ఇప్పటికే పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం, విరిగిపడుతున్న కొండచరియలు.. ఇద్దరు మహిళలు మృతి..
Rains In Uttarakhand
Surya Kala
|

Updated on: Jul 28, 2024 | 3:00 PM

Share

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో క్రమ క్రమంగా ప్రమాదం పెరుగుతోంది. రోడ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. యమునోత్రి డ్యాం కూడా నీటి ప్రవాహానికి తెగిపోయింది. మద్మహేశ్వర్‌కు వెళ్లే రహదారి మూసివేయబడింది. ఉత్తరాఖండ్‌లో ఈ వరద పరిస్థితిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ఎవరైనా పర్యాటకులు చిక్కుకుపోయారా అనే కోణంలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి. నిద్రలో ఉన్న తల్లి , కూతురు ప్రాణాలు కోల్పోయారు.42 ఏళ్ల మహిళ, ఆమె 15 ఏళ్ల శిధిలాల కింద పడి మరణించారు. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.

ఇవి కూడా చదవండి

భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర మార్గం ఉత్తరకాశీ సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), స్థానిక యంత్రాంగం ఇప్పటికే పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఆర్మీ కూడా సిద్ధంగా ఉండాలని కోరారు.

కొండచరియలు విరిగిపడటంతో కనీసం 50 మంది యాత్రికులు మద్మహేశ్వరాలయం సమీపంలో చిక్కుకుపోయారు.

వర్షాలు వరదల కారణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. కుప్పకూలిన ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించాడు. బుద్ధ కేదార్‌లో పలు దుకాణాలు కొట్టుకుపోయాయి. ధర్మగంగ నదిలో ఇళ్లు నీట మునిగాయి. నదీ జలాల కారణంగా పలు వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. నది పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..