భారత్‌ ఆర్మీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. శత్రు దేశాలకు దడ పుట్టించేలా అధునాతన ఎంక్యూ-9బీ డ్రోన్లు..!

అమెరికా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఈ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. మరోవైపు.. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్‌.. తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్‌ డ్రోన్లను సమకూర్చుకోనుంది. కాగా, భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.

భారత్‌ ఆర్మీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. శత్రు దేశాలకు దడ పుట్టించేలా అధునాతన ఎంక్యూ-9బీ డ్రోన్లు..!
Armed Drone
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 02, 2024 | 7:01 PM

మన దేశానికి పక్కలో బల్లెంలా మారిన పాక్‌ చైనా లాంటి దేశాలకు దడ పుట్టించే ప్రిడేటర్‌ డ్రోన్స్‌ దూసుకొస్తున్నాయి. భారత్‌ చేతిలో ఈ డ్రోన్‌ అస్త్రాలు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించనున్నాయి. యస్‌. భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ పేర్కొంది.

అమెరికా, భారత్‌ మధ్య ప్రిడేటర్‌ డ్రోన్లపై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగనుంది.

భారత్‌తో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
 Drone

Drone

ఇక, అమెరికా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఈ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. మరోవైపు.. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్‌.. తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్‌ డ్రోన్లను సమకూర్చుకోనుంది. కాగా, భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పిల్లలకు స్మార్ట్ ఫోన్‌ ఇస్తున్నారా.? ఈ భయంకరమైన అపాయం తప్పదు
పిల్లలకు స్మార్ట్ ఫోన్‌ ఇస్తున్నారా.? ఈ భయంకరమైన అపాయం తప్పదు
ప్రచారపర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మరింత ముమ్మరం!
ప్రచారపర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మరింత ముమ్మరం!
ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బు బదిలీ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బు బదిలీ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
వణుకు పుట్టిస్తున్న వెస్ట్‌ నెయిల్‌ ఫీవర్.. ఈ లక్షణాలుంటే అలర్ట్
వణుకు పుట్టిస్తున్న వెస్ట్‌ నెయిల్‌ ఫీవర్.. ఈ లక్షణాలుంటే అలర్ట్
ఆర్య సినిమా హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిపోయిందో చూశారా..?
ఆర్య సినిమా హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిపోయిందో చూశారా..?
అబ్బా ఇదేం క్రేజ్.. యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో మమితా బైజు.
అబ్బా ఇదేం క్రేజ్.. యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో మమితా బైజు.
మాటంటే మాటే.. తన సినిమాలో బిగ్ బాస్ అమర్‌కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ
మాటంటే మాటే.. తన సినిమాలో బిగ్ బాస్ అమర్‌కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ
మ్యూచువల్ ఫండ్‌లో అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్‌లో అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?
శ్రీనగర్ స్థానంలో ఏయే నేతల మధ్య పోటీ..?
శ్రీనగర్ స్థానంలో ఏయే నేతల మధ్య పోటీ..?
ఓరీ దేవుడో.. ఇదేం భక్తిరా సామీ..! కాలనాగుకు అభిషేకాలు..
ఓరీ దేవుడో.. ఇదేం భక్తిరా సామీ..! కాలనాగుకు అభిషేకాలు..