Union Cabinet Ministers: కొలువుదీరిన కొత్త మంత్రులు.. బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు.. చిత్రాలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేటాయించిన శాఖల బాధ్యతలు త్వరగా చేపట్టాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు.. కేంద్ర మంత్రులు ఇవాళే బాధ్యతలు చేపట్టారు.
Updated on: Jul 08, 2021 | 9:35 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేటాయించిన శాఖల బాధ్యతలు త్వరగా చేపట్టాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు.. కేంద్ర మంత్రులు ఇవాళే బాధ్యతలు చేపట్టారు. ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. తమ కుటుంబీకులు, మంత్రుల మధ్య నూతన మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించారు.

కేబినెట్ మినిస్టర్గా ప్రమోషన్ పొందిన కిషన్రెడ్డి..తనకు కేటాయించిన మూడు మంత్రిత్వశాఖల బాధ్యతలను స్వీకరించారు. పర్యాటకం, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించారు కిషన్రెడ్డి. దేశాన్ని పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే అన్ని శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు.

సమాచారశాఖ మంత్రిగా అనురాగ్ ఠాగూర్ బాధ్యతలు స్వీకరించారు.

రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అశ్వినీ వైష్ణవ్...ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖామంత్రిగా మన్సుఖ్ మాండవియా..ఆరోగ్య శాఖ సహాయంత్రిగా భారతీ ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు.

న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజుజు కొత్తగా బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా అనుప్రియ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.

విదేశాంగశాఖ సహాయమంత్రిగా మీనాక్షి లేఖి బాధ్యతలు చేపట్టారు.

కేబినెట్లో అందరికంటే చిన్నవయస్కుడు నిశిత్ ప్రామాణిక్ కూడా కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 35 ఏళ్ల ప్రామాణిక్ హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు చేపట్టారు పెట్రోలియం మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమాన మంత్రిగా సింధియా, సర్బానంద సోనోవాలా, భూపేంద్ర యాదవ్, బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర సహాయమంత్రిగా అజయ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.

వీరితో పాటు దర్శన్ విక్రమ్, రావ్ సాహెబ్ దాదారావ్, మహేంద్ర భాయ్, జిత్రేంద్ర సింగ్, ధర్మంద్ర ప్రధాన్, అజయ్ భట్, శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖరన్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలందరూ గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు.




