Sons Burnt Alive Mother: దారుణం.. వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేసిన కుమారులు.. ఎక్కడంటే?

నవ మాసాలు మోసి కనిపెంచి, ప్రయోజకులకు చేసిన ఓ తల్లి పట్ల ఆమె ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేసి, అనంతరం ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో కాలి మరణించింది. ఈ దారుణ ఘటన..

Sons Burnt Alive Mother: దారుణం.. వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేసిన కుమారులు.. ఎక్కడంటే?
Sons Burnt Alive Mother
Follow us

|

Updated on: Sep 30, 2024 | 5:03 PM

అగర్తల, సెప్టెంబర్‌ 30: నవ మాసాలు మోసి కనిపెంచి, ప్రయోజకులకు చేసిన ఓ తల్లి పట్ల ఆమె ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేసి, అనంతరం ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో కాలి మరణించింది. త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

త్రిపురలోని ఖమర్‌బారిలో నివసించే ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి 62 ఏళ్ల వయసున్న వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే వృద్ధురాలు మంటల్లో మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడింది మృతురాలి సొంత కుమారులు కావడం విశేషం. పోలీసులు ఆమె ఇద్దరు కుమారులను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించారు.

మృతురాలి భర్త ఏడాదిన్నర కిందట మరణించాడు. అప్పటి నుంచి తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరో కుమారుడు అగర్తలాలో ఉంటున్నట్లు తెలిపారు. కుమారులను అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో శనివారం రాత్రి జరిగినట్లు వారు తెలిపారు. వారిని సోమవారం కోర్టులో హాజరు పరగా.. విచారణ కోసం పోలీసు రిమాండ్ కోరారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..