శాంతిభద్రతల పరిరక్షణ చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి…!

పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌-పీడీఎం నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల నుంచి ముప్పు ముందని పాకిస్తాన్‌ నేషనల్ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ హెచ్చరించినప్పటికీ పీడీఎం కూటమి నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు..

శాంతిభద్రతల పరిరక్షణ చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి...!
Follow us

|

Updated on: Oct 26, 2020 | 1:07 PM

పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌-పీడీఎం నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల నుంచి ముప్పు ముందని పాకిస్తాన్‌ నేషనల్ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ హెచ్చరించినప్పటికీ పీడీఎం కూటమి నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.. భారీ ర్యాలీ తీశారు.. అయితే ఎన్‌సీటీఎ చెప్పినట్టుగానే సమావేవం అనంతరం అక్కడ బాంబులు పేలాయి.. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు..విపక్ష కూటమి నిర్వహించిన సభా స్థలికి దగ్గరలోనే బాంబు పేలడం గమనార్హం.. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పీడీఎం గత నెల 20న ఏర్పాటయ్యింది.. ఇమ్రాన్‌ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ విపక్ష కూటమి ఇప్పటికే లాహోర్‌, కరాచీ నగరాలలో రెండు భారీ ర్యాలీలను నిర్వహించింది.. ర్యాలీల అనంతరం జరిగిన భారీ బహిరంగ సమావేశంలో ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు విపక్ష నేతలు.. ఇక నిన్న బెలూచిస్థాన్‌ ప్రాంతంలోని క్వెట్టాలో మరో భారీ ర్యాలీని నిర్వహించింది పీడీఎం.. ఈ ర్యాలీకి కూడా జనం పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం.. పాకిస్తాన్‌ మిలటరీ రిగ్గించి చేసి ఇమ్రాన్‌ను అధికారంలోకి తెచ్చిందని విపక్ష కూటమి నేతలు ఆరోపించారు.. దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని ఇమ్రాన్‌ను ఎద్దెవా చేశారు పీడీఎం అధ్యక్షుడు, జామియత్‌ ఈ ఇస్లామ్‌ నేత మౌలానా ఫజ్లుర్‌ రహ్మన్‌! లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావెద్‌ బెజ్వాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ నుదిటి రేఖను మార్చాల్సిన సమయం ఆస్నమయ్యిందని అన్నారు పీఎంఎల్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌.. బెలూచిస్థాన్‌ ప్రజలపై దాష్టికాలు కొనసాగవన్నారు..భర్తల జాడ తెలియక భార్యలు, సోదరుల జాడ తెలియక అక్క చెల్లెళ్లు ఆవేదన చెందుతున్నారని, దీనికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అన్నారు. అయితే పీడీఎం చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండిస్తున్నారు. తను ప్రధానమంత్రి కావడానికి ఆర్మీ సాయం చేసిందనడం అవాస్తవమన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..