AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి నిర్దోషి అని తేల్చిన కోర్టు

కొంతమంది నేరగాళ్లు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. మరికొందరు అమయాకులు మాత్రం జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన ఓ అమాయకుడు దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి రావడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఓ కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి నిర్దోషి అని తేల్చిన కోర్టు
Jail
Aravind B
|

Updated on: May 23, 2023 | 4:12 AM

Share

కొంతమంది నేరగాళ్లు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. మరికొందరు అమయాకులు మాత్రం జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన ఓ అమాయకుడు దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి రావడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో అబ్దుల్లా ఆయూబ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను ఖుర్షిద్ అనే కానిస్టేబుల్‌కు తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అయితే ఖుర్షిద్ ఇంటి కిరాయి ఇవ్వకపోవడంతో అబ్దుల్లా అతడ్ని ఇళ్లు ఖళీ చేయించాడు. దీంతో అతనిపై పగబట్టిన ఖుర్షిద్.. రాయ్‌పూర్‌లోని పురాని బస్తీ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందితో కలిసి కుట్ర పన్నాడు. కోటి రూపాయలు విలువ చేసే హెరాయిన్ కలిగి ఉన్నడనే కేసులో అబ్దుల్లాను ఇరికించాడు. దీంతో 2003 మార్చి 14 అబ్దుల్లాకు జైలు శిక్ష పడింది.

తాను అమాయకుడ్నని అబ్దుల్లా ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న 25 గ్రాముల పౌడర్‌ను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అది హెరాయిన్ కాదు.. సాధారణ తెల్లపౌడర్ అని చాలా ఏళ్లకు తెలిసింది. దీంతో ఒక తప్పుడు కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్లాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ న్యాయస్థానం అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవలే అతను విడుదలయ్యాడు. కానీ 20 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని కోర్టు తేల్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇన్నేళ్లపాటు అతడ్ని జైల్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు