CBSE Students: 10,12 తరగతుల ఎగ్జామ్స్‌పై సీబీఎస్​ఈ కీలక ప్రకటన

సీబీఎస్​ఈ విద్యార్థులకు అలెర్ట్. 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలపై బోర్డు  కీలక ప్రకటన చేసింది.

CBSE Students: 10,12 తరగతుల ఎగ్జామ్స్‌పై సీబీఎస్​ఈ కీలక ప్రకటన
Cbsc Exams
Follow us

|

Updated on: Oct 14, 2021 | 9:11 PM

సీబీఎస్​ఈ విద్యార్థులకు అలెర్ట్. 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలపై బోర్డు  కీలక ప్రకటన చేసింది. నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో ఎగ్జామ్స్ జరుగుతాయని, అందుకు సంబంధించిన డేట్​ షీట్​ ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు తెలిపింది.  90 నిమిషాల నిడివి గల ఎగ్జామ్స్.. ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటాయని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. ఉదయం 11:30కి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది.

కరోనా కారణంగా గతంలో.. 2021-22 అకడమిక్ ఇయర్‌కి మార్పులు చేసింది సీబీఎస్​ఈ. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ ఛేంజస్ చేసింది. టర్మ్​-1 పరీక్షల తర్వాత మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్ నన్యమ్​ భరద్వాజ్ తెలిపారు. పాస్​, కంపార్ట్​మెంట్​, రిపీట్​ కేటగిరీలో విద్యార్థులు ఉండరని చెప్పారు. కాగా.. రెండు టర్మ్​ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేస్తామని చెప్పారు. ఫస్ట్​ టర్మ్​ పరీక్షలకు ముందే, ఇంటర్నల్​ అసెస్​మెంట్లు, ప్రాక్టికల్​ పరీక్షలు పూర్తవుతాయని వెల్లడించారు. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తామన్నారు.  2022 మార్చి-ఏప్రిల్​లో రెండో టర్మ్​ ఎగ్జామ్స్ జరిగే అవకాశమున్నట్టు భరద్వాజ్​ అభిప్రాయపడ్డారు.

Also Read: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…