Tamil Nadu: తమిళనాడులో రాజకీయ సమరం.. పన్నీర్‌ సెల్వంపైకి వాటర్‌ బాటిళ్లు విసిరిన ఈపీఎస్‌ వర్గం

అన్నా డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ రచ్చ రచ్చగా మారింది. ఓపీఎస్‌పైకి ఈపీఎస్‌ వర్గీయులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు ఓపీఎస్‌.

Tamil Nadu: తమిళనాడులో రాజకీయ సమరం.. పన్నీర్‌ సెల్వంపైకి వాటర్‌ బాటిళ్లు విసిరిన ఈపీఎస్‌ వర్గం
O Panneerselvam
Follow us

|

Updated on: Jun 23, 2022 | 8:32 PM

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైడ్రామా తర్వాత ఇవాళ జరిగిన అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండాకుల పార్టీలో ఈపీఎస్‌, ఓపీస్‌ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశం నిర్వహించాలని పళని స్వామి వర్గం ప్లాన్‌ చేస్తే, దాన్ని అడ్డుకునేందుకు పన్నీర్‌ సెల్వం వర్గం చివరి వరకు ప్రయత్నించింది. మద్రాస్‌ హైకోర్టులో నిన్న అర్ధరాత్రి అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. మీటింగ్‌ను ఆపలేకపోయినా తనకు కావాల్సింది సాధించుకున్నారు పన్నీర్‌ సెల్వం. పార్టీ అధినేత ఎన్నిక జరగకుండా చూడాలన్న పన్నీర్‌ విజ్ఞప్తి అనుకూలంగా కోర్టు ఆదేశాలు వచ్చాయి.

చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్‌లో అన్నా డీఎంకే కీలక సమావేశం జరిగింది. ఇప్పటి వరకు మాజీ సీఎంలు పళని స్వామి, పన్నీర్‌ సెల్వం పార్టీ కోఆర్డినేటర్లుగా సమాన హోదాలో ఉన్నారు. అయితే ఇద్దరు కాకుండా ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలన్న డిమాండ్‌ పార్టీ శ్రేణుల నుంచి కొంతకాలంగా వస్తోంది.

#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party’s General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai.

ఇవి కూడా చదవండి

He walked out halfway through the meeting. pic.twitter.com/lVb1AdvAGt

— ANI (@ANI) June 23, 2022

దాంతో పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు పళని, పన్నీర్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కానీ మెజారిటీ నాయకుల మద్దతు పళనికే ఉన్నట్టు ముందు నుంచీ తెలుస్తూనే ఉంది. అందుకే పన్నీర్‌ అడ్డుపుల్ల వేస్తూ వస్తున్నారు. ముందుగా ఊహించినట్టే ఇవాళ సమావేశంలో ఎక్కువ మంది పళని స్వామి వైపు మొగ్గు చూపారు. దీంతో పన్నీర్‌ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్‌ చేశారు.

సమావేశ వేదికపై పళని, పన్నీర్‌ ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదు. ఏక నాయకత్వ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పళని వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది పన్నీర్‌కు, ఆయన వర్గీయులకు నచ్చలేదు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పన్నీర్‌ అనుచరుడు మైక్‌లో ప్రకటించారు.

అనంతరం వేదిక దిగి వెళ్లబోతున్న పన్నీర్‌పైకి కింద నుంచి ఈపీఎస్‌ వర్గీయులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. దీంతో పన్నీర్‌కు ఆయన అనుచరులు, సెక్యూరిటీ రక్షణగా నిలిచి బయటకు తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి జూలై 11న పార్టీ సమావేశం జ‌ర‌గ‌నుంది. అప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

జాతీయ వార్తల కోసం

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!