AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఊరంతా కలిసి తెచ్చిన సారే.. ఆ వేడుక చూసేందుకు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కనకదుర్గమ్మ అమ్మవారి 30వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె, చీరలు సమర్పించేందుకు తలపై పళ్లెములు మోస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ భక్తిపూర్వక మహోత్సవంలో ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ, అన్నసమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఊరంతా కలిసి తెచ్చిన సారే.. ఆ వేడుక చూసేందుకు..
Sri Kanaka Durgamma
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 09, 2026 | 6:52 PM

Share

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఊరు ఊరంతా కలిసి సారే సమర్పించారు.  గాంధీ నగర్‌ లో వేలసిన కనకదుర్గమ్మ అమ్మవారి 30 వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా వేడుక నిర్వహించారు. ఊరు మొత్తం కలిసి భక్తులు అమ్మవారికి సారే, చీరను సమర్పించారు. వేలాదిమంది మహిళలు అంతా ఒక్కసారిగా కలిసి అమ్మవారికి సారే ను తలపై పెట్టుకొని తరలి వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలనంత వైభవంగా కనిపించింది.

భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూలు, పలు రక రకాల స్వీట్లు, ప్రసాదాలు పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీరలు పళ్లెల్లో పెట్టుకుని తలపై మోస్తూ ఊరేగింపుగా తరలి వెళ్లారు.ఈ ఊరేగింపు అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ నుండి గారపాటివారి వీధి, మహిపాలవీధి, గాంధీనగర్‌ మీదుగా కనకదర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మహిళాలు ఎంతో భక్తుతో అమ్మవారికి సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

ఆలయ అర్చకులు రామేశ్వరవరపు రామప్రసాద్‌ అధ్వర్యంలోఅమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారేను ప్రసాదాలు భక్తులకు పంపిణి చేశారు. ఆలయకమిటీ అధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు, గాజులు పంపిణి చేశారు. అనంతరం జరిగిన బారీ అన్నసమాధారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.