PM Modi in AP Live: వికసిత్ భారత్లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!
PM Modi Bhogapuram Airport Launch Live Updates in Telugu: ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.

LIVE NEWS & UPDATES
-
పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు
తాజా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో… ఏపీలో కనెక్టివిటీ, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని కేంద్రం చెబుతోంది. దీంతో మోదీ పర్యటనలు రాష్ట్ర రాజకీయాలతో పాటు అభివృద్ధి చర్చల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
-
బ్లూ ఎకానమీ హబ్గా విశాఖ
2022లో విశాఖ పర్యటన సందర్భంగా రూ.10,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైల్వే, రోడ్లు, పోర్టు, పెట్రోలియం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. విశాఖను బ్లూ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని అప్పుడే ప్రకటించారు.
-
-
విశాఖతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం
2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ… తాజా భోగాపురం పర్యటనతో కలిపి సుమారు 15 సార్లు ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. కేంద్ర పథకాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఎన్నికల ప్రచారం, అధికారిక కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఈ పర్యటనల్లో విశాఖపట్నానికే అత్యధిక ప్రాధాన్యం దక్కింది. ఇప్పటివరకు సుమారు 5 సార్లు విశాఖను సందర్శించిన మోదీ… నేవీ ఫ్లీట్ రివ్యూ, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కార్యక్రమాలు, పెట్టుబడుల సదస్సులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
-
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీకి ఏపీతో ప్రత్యేక అనుబంధం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నానికి పలుమార్లు వచ్చి కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
-
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!
భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ షెడ్యూల్
ఉ.10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కు మోదీ రాక
ఉ.10:50-10:55 టెర్మినల్ భవనానికి చేరిక
ఉ.10:55-10:58 కూచిపూడి నృత్యంతో స్వాగతం
ఉ.11:00-11:15 ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల పరిశీలన
ఉ.11:17-11:25 ఓపెన్టాప్ జీప్లో సభా వేదికకు మోదీ
ఉ.11:30-12:55 ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, ప్రసంగం
మ.1:05కి భోగాపురం నుంచి ఢిల్లీకి ప్రధాని మోదీ
-
-
ప్రధాని రాకతో భద్రత
ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మూడు లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రత్యేకంగా, చిరకాలంగా గుర్తిండిపోయేలా సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.
-
30 వేల మొక్కలతో అక్షరాల రూపం
భోగాపురం వాసులు ఆనందాన్ని అక్షరాల రూపంలో అద్భుత ప్రకృతి సొగసులతో ఈ స్వాగతం సిద్ధం చేశారు. వారి ఆనందాన్ని 30 వేల మొక్కలతో అక్షరాల రూపం ఇచ్చారు. దీనికి సుమారు వారం రోజులు పాటు 70 మంది పని చేశారు. ఈ 30 వేల మొక్కల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో బన్నింగ్ భుష్ గడ్డి మొక్కలు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ గడ్డి బాగా కనిపించేందుకు డార్క్ కలర్ మొక్కలు చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. ప్రధాని విమానం ల్యాండ్, టేకాఫ్ సమయంలో ఈ అపురూప స్వాగతం కనిపించాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు
-
-
ప్రకృతి సొగసులతో ప్రధానికి స్వాగతం
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు 30 వేల మొక్కలు సిద్ధమయ్యాయి. ప్రకృతి సొగసులతో ప్రధానికి సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ప్రధాని మోదీకి భోగాపురం వాసులు వినూత్న స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్ ప్రారంభ వేడుక వస్తున్నా ప్రధాని మోదీకి విమానం నుంచే కనిపించే విధంగా 30 వేల మొక్కలతో WELCOME.. PM MODI JI, CM CBN JI అని రాశారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఈ తరహా స్వాగతం లభించలేదనే చెప్పాలి.
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవవేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో భోగాపురం విమానాశ్రయం ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా.. పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని.. వికసిత భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పోస్ట్పై స్పందించిన సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్ తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారన్న అంచనా 5వేల బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, 7వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భోగాపురంలో ప్రధాని మోదీ ల్యాండైన తర్వాత 13వేల మందికిపైగా గిరిజన బాలికల థింసా నృత్యంతో స్వాగత ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. ఈ థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు మంత్రి సంధ్యారాణి.
శనివారం (ఆగస్టు 01) ఉదయం పదకొండున్నర తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఉదయం 10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుని.. 10:55 వరకు టెర్మినల్ని పరిశీలిస్తారు. పదకొండూ 17 నిమిషాలకు ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా బయల్దేరి పది నిమిషాల్లో సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. పదకొండున్నర తర్వాత ఎయిర్పోర్ట్ను ప్రారంభించి, మాట్లాడతారు ప్రధాని. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా.. పూర్తిస్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి మొదలుకానున్నాయ్. ఆరోజు నుంచే భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విశాఖవాసులకు సూచించారు. మూడు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=NTqa4XRZqZI
Published On - Aug 01,2026 7:20 AM




