Tamil Nadu: భార్యకు మరో వ్యక్తితో సంబంధంపై అనుమానం.. నేరుగా అత్తింటికి వెళ్లిన భర్త.. కట్ చేస్తో పోలీస్ స్టేషన్లో..
Tamil Nadu: తమిళనాడులో దారుణహత్య జరిగింది. భార్యను హత్య చేసి ఏపీలోని పోలీస్టేషన్లో లొంగిపోయాడు భర్త. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
Tamil Nadu: తమిళనాడులో దారుణహత్య జరిగింది. భార్యను హత్య చేసి ఏపీలోని పోలీస్టేషన్లో లొంగిపోయాడు భర్త. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వార్తలు ఇలా ఉన్నాయి. తిరపత్తూరులోని ఎలువంపట్టిలో భార్య అరున్ములి ని పైసాచికంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు భర్త వేలుమురుగన్. తిరపత్తూరు కు జిల్లాకు చెందిన అరున్ములిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు వేలుమురుగన్. ఇతడి స్వస్థలం కుప్పం మండలం గణేష్ పురం. చాట్ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు వేలుమురుగన్.
అయితే గతేడాది నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది అరుణ్ములి. అప్పట్లో ఆరున్ములి మిస్సింగ్ పై ఫిర్యాదు చేశాడు భర్త వేలుమురుగన్. ఆ తర్వాత అరుల్ముని ఆచూకీ తెలుసుకొని భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు కుప్పం పోలీసులు. ఆ తర్వాత మూడు నెలలుగా పుట్టింటిలోనే ఉంది అరుల్ముని. అయితే ఇవాళ ఉదయం తిరుపత్తూరులో ఉన్న అరున్ములి దగ్గరకు వెళ్లి కత్తితో పొడిచి చంపాడు వేలుమురుగన్. హత్య చేసిన తర్వాత నేరుగా కుప్పం పోలీస్ స్టేషన్ కు చేరుకొని లొంగిపోయాడు వేలుమురుగన్. తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే హత్య చేశానని పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించాడు వేలుమురుగన్.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..