BJP vs Media: విమర్శిస్తే కొడతా.. మీడియా ప్రతినిధులపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఫైర్..!

BJP vs Media: తమిళనాడులో బీజేపీ వర్సెస్ మీడియా అన్నట్లుగా పరిస్థితి మారింది. రాష్ట్ర మీడియాపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫుల్ ఫైర్ అయ్యాడు.

BJP vs Media: విమర్శిస్తే కొడతా.. మీడియా ప్రతినిధులపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఫైర్..!
Annamalai
Follow us

|

Updated on: May 28, 2022 | 6:58 PM

BJP vs Media: తమిళనాడులో బీజేపీ వర్సెస్ మీడియా అన్నట్లుగా పరిస్థితి మారింది. రాష్ట్ర మీడియాపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫుల్ ఫైర్ అయ్యాడు. ఏకంగా కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ముందే.. తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తమిళ భాష తదితర అంశాలను సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. సీఎం కామెంట్స్.. పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, సీఎం స్టాలిన్ వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. ఆ ప్రశ్నలతో ఆగ్రహానికి గురైన అన్నామలై.. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీకి కొమ్ముకాసే మీడియా తమను ప్రశ్నించడమా? అంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. బీజేపీని విమర్శిస్తే కొడతానంటూ హెచ్చరించారు. అన్నామలై హెచ్చరికలపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. బీజేపీ కార్యక్రమాలను బాయ్ కాట్ చేయాలనీ జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయించాయి.