AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: ఢిల్లీ యూనివర్శిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Dharmendra Pradhan: ఢిల్లీ యూనివర్శిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Union Minister Dharmendra Pradhan
Aravind B
|

Updated on: Sep 30, 2023 | 9:57 PM

Share

అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛ భారత్‌తో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. అక్టోబర్ 1న ఉదయం 9.30 AM గంటలకు కేంద్రమంత్రితో సహా.. పలువులు అతిథులు యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 9.55 AM కు అక్కడి నుంచి బయలుదేరుతారు.

అనంతరం 10.00 AM నుంచి 11.00 AM గంటల వరకు డాక్టర్ జీసీ నరంగ్ మార్గ్, అలాగే శ్రేయా మిశ్రా మార్గ్ ప్రాంతాల్లో చేపట్టే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆ తర్వాత 11.15 AM నిమిషాలకు ఇంటర్నేషనల్‌ గెస్ట్ హౌస్‌లో టీ విరామం తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరనున్నారు. స్వచ్ఛ హై సేవ, ఏక్ గంటా, ఏక్ సాథ్ అనే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రితో సహా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ ప్రొ. బరలాం పానీ, సౌత్ ఢిల్లీ క్యాంపస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్, అలాగే వివిధ కళాశాలలకు చెందిన ప్రినిపల్స్, టీచర్స్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..