AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏముంది అక్కడ కొబ్బరిపీచేగా అనుకుంటే పొరపడినట్లే.. పోలీసులే స్టన్ అయ్యారు..

ఎందెందు వెతికినా అదే.. ఇన్‌కమ్ బాగా ఉండటంతో అక్రమార్కులు అస్సలు తగ్గడం లేదు. వీరి నెట్ వర్క్ ఇండియాలో మాత్రమే కాదు. విదేశాలకు సైతం విస్తరించింది. అయితే వీరి క్రైమ్‌ చేసేప్పుడు క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు ఏ మాత్రం చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే కలుగులో ఉన్న ఎలుక ఎప్పటికైనా బయటకు రాక తప్పుతుందా..? అలానే....

ఏముంది అక్కడ కొబ్బరిపీచేగా అనుకుంటే పొరపడినట్లే.. పోలీసులే స్టన్ అయ్యారు..
Husk Of Coconut
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 30, 2023 | 6:26 PM

Share

కొబ్బరి పీచు రవాణా ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసింది రాచకొండ ఎస్ఓటి టీమ్. గత కొంత కాలంగా పోలీసుల కళ్ళు గప్పి గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా నుండి సుమారు 75 లక్షల రూపాయల విలువైన 250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మలై స్వామి, రామర్‌లు హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు కలిసి గంజాయిని రవాణా చేస్తున్నారు. వీరిద్దరికి కేరళకు చెందిన రాజేష్, ఒడిశాకి చెందిన చంద్ర శేఖర్‌లు పరిచయమయ్యారు. మలై స్వామి రామర్‌లు గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొని రాగా, రాజేశ్ రిసీవ్ చేసుకుంటాడు. చంద్రశేఖర్ ఆ గంజాయిని అమ్ముతాడు. ఇలా నలుగురు కలిసి గంజాయి రవాణా చేయడం అమ్మడం, చేస్తున్నారు.

ఈ ముఠాకు సంబంధించిన ఇద్దరు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు 250 కిలోల గంజాయిని కొనుగోలు చేసి డీసీఎం వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులకు కనిపించకుండా డీసీఎం వాహనంలో కొబ్బరి పీచును అడ్డుగా పెట్టి తరలిస్తున్న వైనాన్ని గుట్టురట్టు చేశారు. గంజాయి తరలిస్తున్న మలై స్వామి, రామర్‌లను అరెస్టు చేశారు. వీరి నుండి 250 కిలోల గంజాయి  స్వాధీనం చేసుకున్నారు. మలై స్వామి, రామర్‌లు ఇప్పటి వరకు రెండు సార్లు గంజాయిని హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడులకు వీరు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని సీపీ చెబుతున్నారు. అంతేకాదు శ్రీలంకకు కూడా గంజాయిని ఎగుమతి చేస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. గంజాయి సరఫరా చేసే వారి పైన కాకుండా ఇకమీదట వినియోదారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ కమిషనర్ చౌహన్ చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 100 మంది గంజాయి తీసుకునేవారిపై కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా నగరంతో పాటు ఇంకా ఏ ఏ‌ ప్రాంతంలో సరఫరా చేశారో దర్యాప్తులో గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..