AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక పర్యాటక ప్రదేశాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్ సిటీలను చూడాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ మీకు మంచి అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల టూర్‌ను తాాజాగా ప్రవేశపెట్టింది. ఈ టూర్‌లో అనేక పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. వాటి వివరాలు ఇలా..

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..
Yadadri
Venkatrao Lella
|

Updated on: Mar 03, 2026 | 10:21 AM

Share

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ప్రతీ రోజు ఉంటుంది. ఈ ప్యాకేజీలో యాదరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయంతో పాటు చిలుకూరు బాలాజీ, స్వర్ణగిరి దేవాలయంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించవచ్చు. పూర్తిగా రోడ్డు మార్గంలో ఈ టూర్ ఉంటుంది. బస్సు సౌకర్యంతో పాటు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సౌకర్యం పర్యాటకులకు కల్పిస్తారు. ఇక హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్లేసెస్‌ను కూడా చూడవచ్చు. ఈ టూర్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సందర్శించే ప్రదేశాలు

తొలి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద పిక్ చేసుకుంటారు. మొదటి రోజు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, లుంబినీ పార్క్ వంటి ప్రదేశాల సందర్శన ఉంటుంది. అనంతరం హోటల్‌లో బస ఉంటుంది. ఇక రెండు రోజు చిలుకూరి బాలాజీ టెంపుల్, లోటస్ టెంపుల్ దర్శన అవకాశం ఉంటుంది.  రాత్రి హోటల్‌లో వసతి సౌకర్యం ఉంటుంది మూడో రోజు యాదాద్రి లక్ష్మినరసింహస్వామి, స్వర్ణగిరి ఆలయాల సందర్శన ఉంటుంది. నాలుగో రోజు రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ ఉంటుంది. అనంతరం సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద డ్రాప్ చేస్తారు

ప్యాకేజీ ధరలు ఇవే..

-డబుల్ షేరింగ్ ఒక్కో పర్సన్‌కు స్టాండర్ట్ రూ.17,430, కంఫర్ట్ రూ.20,590గా ఉంది.

-త్రిపుల్ షేరింగ్ స్టాండర్ట్ రూ.12,860, కంఫర్ట్ రూ.15,830గా ఉంది

-పిల్లలకు విత్ బెడ్ డబుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.8080, కంఫర్ట్ రూ.10,670

-పిల్లలకు విత్ బెడ్ త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ ధర రూ.6220, కంఫర్ట్ ధర రూ.8080గా ఉంది.

-4 నుంచి 6 మంది ప్రయాణికులకు డబుల్ షేరింగ్ రూ.12,700, కంఫర్ట్ రూ.15,850గా ఉంది

-4 నుంచి 6 మంది ప్రయాణికులకు త్రిపుల్ షేరింగ్ స్టాండర్ట్ ధర రూ.10, 460గా ఉండగా.. కంఫర్ట్ ధర రూ.13,430గా ఉంది

సౌకర్యాలు ఇవే..

-హోటల్స్‌లో ఏసీ రూమ్ ఫెసిలిటీ

-బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సౌకర్యం

-ఏసీ బస్సులో ప్రయాణం

*ట్రావెల్ ఇన్యూరెన్స్

ఇవి ఉండవు

-లంచ్, ఇతర ఫుడ్

-ట్రైన్, ఫ్లైట్, బస్సు టికెట్లు అందించరు

-ఎంట్రన్స్ టికెట్లు పర్యాటకులే చెల్లించుకోవాలి

-టూర్ గైడ్ సర్వీసులు

Follow Us
'నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు'
'నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు'
ప్లేఆఫ్స్ చేరకుండా సొంత జట్టునే ఇంటికి పంపేస్తున్నావ్‌గా
ప్లేఆఫ్స్ చేరకుండా సొంత జట్టునే ఇంటికి పంపేస్తున్నావ్‌గా
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..