AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి!

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు ప్రమాదవ శాత్తు ప్రాజెక్టులో పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్స్ వారి కోసం గాలింపు చేపట్టారు.

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి!
Sriram Sagar Project Tragedy
Anand T
|

Updated on: Jul 26, 2026 | 9:16 PM

Share

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. అయితే బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీంతో పాటు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

అయితే మృతులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కలిమ్‌, నజవత్‌, అజీమ్‌గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. పర్యాటకులు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us