Budget Session 2022: ఇవాళ్టి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలను రెడీ చేసుకుంటున్న పాలక, విపక్షాలు

రెండో విడత పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Budget Session 2022: ఇవాళ్టి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలను రెడీ చేసుకుంటున్న పాలక, విపక్షాలు
Follow us

|

Updated on: Mar 14, 2022 | 7:46 AM

రెండో విడత పార్లమెంట్​ బడ్జెట్(Budget Session Parliament) సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభలు ఒకేసారి భేటీ కానున్నాయి. కోవిడ్ నిబంధనల(Covid Restrictions) ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సాహంతో అధికార బీజేపీ, పరాజయ భారంతో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పార్లమెంట్‌కు రానున్నాయి.

ఏప్రిల్‌ 8 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. జమ్ము కశ్మీర్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత వైఖరి, భారతీయుల తరలింపుపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ పార్లమెంటుకు వివరిస్తారు.

బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్​సభలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్​ను కూడా పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది.

బడ్జెట్ సమావేశాల తొలి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..