AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ ! కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ

కరోనా సోకి విషమ స్థితిలో ఉన్న రోగులకు తన 'ప్లాస్మా' ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రకటించారు. స్వల్పంగా కరోనా వైరస్ సోకిన తాను సెల్ఫ్  ఐసోలేషన్ లో..

ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ ! కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 2:16 PM

Share

కరోనా సోకి విషమ స్థితిలో ఉన్న రోగులకు తన ‘ప్లాస్మా’ ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రకటించారు. స్వల్పంగా కరోనా వైరస్ సోకిన తాను సెల్ఫ్  ఐసోలేషన్ లో ఉన్నానని, తనకు ప్లాస్మా అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు. కరోనా రోగులకు ఈ థెరపీ చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారమే ఈయనకు కరోనా పాజిటివ్ సోకింది. ప్లాస్మా థెరపీపై కృత్రిమ ఆంక్షలు విధించడం సరికాదని ఆయన అన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్  ఆరోగ్యం ఈ చికిత్సతోనే మెరుగు పడిందన్నారు.  కరోనా వ్యాధికి గురైన జైన్ ….పది రోజులపాటు చికిత్స.పొంది.. . ప్లాస్మా థెరపీతో  కోలుకుని ఈ నెల 26 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తను ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం డాక్టర్లు సిఫారసు చేస్తే  ప్లాస్మా ఇస్తానని సింఘ్వీ పేర్కొన్నారు.

ఢిల్లీలో తాజాగా 19 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనాపై తమ ప్రభుత్వం జరుపుతున్న పోరులో ప్లాస్మా ఐదో ‘ఆయుధమని’ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. టెస్టింగ్, ఐసోలేషన్, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, స్క్రీనింగ్, సర్వే .. ఇవి తమ ఇతర ఆయుధాలని ఆయన వివరించారు.