AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Setu: వందల ఏళ్ల కల తీరనున్న వేళ.. సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు

సేతు సముద్ర నిర్మాణం చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. సీఎం స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి.

Ram Setu: వందల ఏళ్ల కల తీరనున్న వేళ.. సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు
Ram Setu
Surya Kala
|

Updated on: Jan 13, 2023 | 7:25 AM

Share

భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ప్రాంతంలో సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీర్మానించింది. దీనికి బీజేపీ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో వందల ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురించాయి. చాలా కాలంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీజేపీ.. తాజాగా డీఎంకేకు మద్దతు పలికింది. అయితే, రామసేతుకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని షరతు విధించింది. సేతు సముద్ర నిర్మాణం చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. సీఎం స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంలో కొనసాగుతున్న జాప్యం తమిళనాడు అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందుకే నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను కొసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ మధ్యే కామెంట్ చేశారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్మానం తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అలా కాకుండా నౌకలు ప్రయాణించేందుకు వీలుగా చిన్నపాటి మార్పులు చేసినట్లయితే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా కేవలం భారత్‌ జలాల ద్వారానే రవాణా చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం భారత్‌, శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో సేతుసముద్ర ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా అటు తమిళనాడుకు, ఇటు భారత్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, నౌకల రవాణాకు అనుకూలంగా మార్చాలంటే పురాతన రామసేతు మార్గంలో కొంతభాగాన్ని తవ్వాల్సి వస్తోంది. ఇది ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకంగా మారింది. గతంలో చాలా సార్లు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడినా..మత పరంగా సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..