AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: దొంగల బీభీత్సం.. వృద్ధురాలి కాళ్లు తెగ‌న‌రికి క‌డియాలు చోరీ.. రాజ‌స్థాన్‌లో దారుణం

స్థానికంగా నివసిస్తున్న ఓ వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమె రెండు కాళ్ల‌ను న‌రికేసిన దొంగలు క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.

Rajasthan: దొంగల బీభీత్సం.. వృద్ధురాలి కాళ్లు తెగ‌న‌రికి క‌డియాలు చోరీ.. రాజ‌స్థాన్‌లో దారుణం
Rajasthan
Jyothi Gadda
|

Updated on: Oct 09, 2022 | 2:12 PM

Share

దొంగలు రెచ్చిపోతున్నారు.అడ్డొచ్చిన వారి ప్రాణాలు తీసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో దొంగలు తెగబడ్డారు. కాళ్ల క‌డియాల కోసం దుండగులు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ న‌రికి లూటీకి పాల్పడ్డారు.జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న ఓ వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమె రెండు కాళ్ల‌ను న‌రికేసిన దొంగలు క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలి కాళ్లను నరికేశారు. రాజస్థాన్ జ్యూయలరీ దోపిడీపై పోలీసులు వివరాలు వెల్లడించారు. 100 ఏళ్ల వృద్ధురాలి కాళ్లు నరికివేసి కాళ్ల కడియాలు దోచుకెళ్లారని గల్టా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళను ఇంటి సమీపంలోనే వదిలేసి నేరస్తులు పరారయ్యారు. మహిళ మెడపై గాయం గుర్తులు కూడా ఉన్నాయని.. నేరానికి ఉపయోగించిన ఆయుధంతో పాటు ఆమె కాళ్లకు తెగిన భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దొంగ‌ల కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. విష‌యం గురించి నా బిడ్డ‌ ఫోన్ చేసి చెప్పింద‌ని బాధితురాలి కుమార్తె గంగాదేవి విల‌పిస్తూ చెప్పింది.

ఇవి కూడా చదవండి

బాధితురాలి కుమార్తె గంగాదేవి బయటకు వెళ్లి వచ్చే లోపుగానే దొంగలు దారుణానికి పాల్పడ్డారని చెప్పింది. ఆమె పాదాల వద్ద తెగిపడిన భాగాలు చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌ గురయ్యాయని చెప్పింది. తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం అందుకున్న వెంటనే స్థానికుల సాయంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.ఇరుగు పొరుగు వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ హృద‌య‌విధార‌క ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్