AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portugal’s support: భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే.. మ‌ద్దతు పలికిన పోర్చుగ‌ల్‌..

Member of UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు మద్దతు తెలిపింది పోర్చుగల్. పార్లమెంట్‌ సెంట్రల్​హాల్​లో జరిగిన సమావేశంలో పాల్గొన్న..

Portugal's support: భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే.. మ‌ద్దతు పలికిన పోర్చుగ‌ల్‌..
Portugal Support For India
Sanjay Kasula
|

Updated on: Mar 16, 2021 | 12:51 PM

Share

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు మద్దతు తెలిపింది పోర్చుగల్. పార్లమెంట్‌ సెంట్రల్​హాల్​లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ అధ్యక్షుడు ద్యువార్తె పషికో..ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

పోర్చుగ‌ల్‌, భార‌త్ మ‌ద్య ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య 500 ఏళ్ల నాటి బంధం ఉంద‌ని అన్నారు. ఒక‌రికి ఒక‌రు బాగా తెలుసు అని కేవ‌లం మిత్ర దేశాలు మాత్ర‌మే కాదు గుర్తు చేశారు. మ‌నం సోద‌రుల్లా ఉన్నామ‌ని ఇంట‌ర్ పార్ల‌మెంట‌రీ యూనియ‌న్ అధ్య‌క్షుడు డార్టీ పాచికో వెల్లడించారు.

ప్రంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భార‌త్‌ అని పాచికో పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లోనూ.. స్థానిక నుంచి జాతీయం వ‌ర‌కు.. మ‌హిళ‌లు, యువ‌కుల‌తో దేశం స‌మ‌గ్రంగా క‌నిపిస్తోంద‌ని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన భావాల‌కు భార‌త్ గౌర‌వం ఇస్తుంద‌ని పాచికో అన్నారు.

ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌రిగే సంస్క‌ర‌ణ‌ల‌కు పోర్చుగ‌ల్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, యూఎన్‌లో భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌ను శాశ్వ‌త స‌భ్య‌దేశంగా మార్చేందుకు పోర్చుగ‌ల్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని పాచికో తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్​కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్​ను సమర్థించారు పషికో. భారత్..అన్ని రకాల రాజకీయ, మత సిద్ధాంతాలను గౌరవిస్తుందని..మహిళలు, యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

భారత్​, పోర్చుగల్​ మధ్య ప్రత్యేక బంధం ఉందని.. గత 5వందల ఏళ్లుగా ఈ బంధం కొనసాగుతోందన్నారు పషికో. ఇరు దేశాలు స్నేహితులు అనే కంటే సోదరులనే చెబుతానన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించాలన్న ప్రతిపాదనను పోర్చుగల్ సమర్థిస్తుందని ప్రకటించారు.

ప్ర‌ప‌చంలో భార‌త్‌ది అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం అని అన్నారు. దేశంలో 130 కోట్ల మంది పౌరులు ఉన్నార‌ని, గ‌త 74 ఏళ్లలో.. భాతీయ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ మ‌రింత బ‌ల‌ప‌డింద‌న తెలిపారు. ఇప్పుడు మనం 75వ స్వాతంత్య్ర సంబ‌రాలు నిర్వ‌హించుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. పార్ల‌మెంట్‌లో సెంట్ర‌ల్ హాల్ దీనికి సాక్ష్య‌మ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా అన్నారు.

ఇవి కూడా చదవండి

Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన..

World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు

Oye Bat Dikha: “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్‌ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..