AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేడు మోర్బీ కేబుల్‌ బ్రిడ్జిని పరిశీలించనున్న ప్రధాని మోడీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ

ఈ విషాద దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న, ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన కేబుల్ వంతెనపై  విచారణ ప్రారంభించింది.

PM Modi: నేడు మోర్బీ కేబుల్‌ బ్రిడ్జిని పరిశీలించనున్న ప్రధాని మోడీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Pm Narendra Modi
Basha Shek
|

Updated on: Nov 01, 2022 | 8:12 AM

Share

గుజరాత్‌లో మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి కూలి సుమారు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్‌ పూజలు చేస్తోన్న సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ ప్రాంతాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు పరిశీలించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మోర్బీ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించింది. ఈ మేరకు సోమవారమే (అక్టోబర్‌ 31)గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించింది. కాగా మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు.  కాగా ఈ విషాద దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న, ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన కేబుల్ వంతెనపై  విచారణ ప్రారంభించింది. మరోవైపు  ఇదే  కేసులో పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

సుప్రీంలో పిల్‌..

మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా ఉన్న పాత వంతెనలపై ఎక్కువ మంది గుమిగూడకుండా, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోర్బీ విషాదం తర్వాత ద్వారకలో వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నారు. గోమఘాట్ సమీపంలోని సుదామ సేతును కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే మూసివేశారు. ద్వారకలోని ఆలయాన్ని సందర్శించే భక్తులు క్రమం తప్పకుండా సుదామ సేతుని సందర్శిస్తున్నారు. దీంతో ఈ పాత వంతెనపై యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందవి. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సుదామ సేతును మూసివేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం