AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లక్ష్యం అదే.. గుజరాత్ గౌరవ్ అభియాన్‌లో ప్రధాని మోడీ

నవ్‌సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. 'గుజరాత్ గౌరవ్ అభియాన్' లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

PM Narendra Modi: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లక్ష్యం అదే.. గుజరాత్ గౌరవ్ అభియాన్‌లో ప్రధాని మోడీ
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2022 | 12:36 PM

Share

PM Narendra Modi Gujarat Visit: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ ఎప్పటికప్పడు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల్లో ఇప్పటికే నాలుగు సార్లు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తాజాగా శుక్రవారం కూడా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్‌లో రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు.

తాను గుజరాత్‌ను విడిచిపెట్టిన తర్వాత, ఆ బాధ్యతను స్వీకరించిన భూపేంద్ర భాయ్, సిఆర్ పాటిల్ ఉత్సాహంతో.. ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగించినందుకు గర్వపడుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అందరి అభివద్ది కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్‌సారి, వల్సాద్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు.

బీజేపీ సర్కార్ 8ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధిపై ఎవరూ దృష్టిసారించలేదంటూ.. మోడీ విమర్శించారు.

కాగా.. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. సంప్రదాయ పద్దతిలో మేళా తాళాలతో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ.. గిరిజనుల నృత్యాలను తిలకిస్తూ.. ముందుకు సాగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!