PM Modi: భారత ఆర్థిక వృద్ధిలో కొత్త శకం.. ఆకాంక్ష నెరవేరే దిశగా ప్రయాణం.. కీలక నివేదికలను పంచుకున్న ప్రధాని మోడీ

Economy of India: కరోనా ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థిక రంగంతో కుదేలయ్యాయి. ఆ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని దేశాలు నేటికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. సవాళ్లను పరిష్కరించడానికి మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టింది. దీంతో $2.7 ట్రిలియన్ల GDP తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.

PM Modi: భారత ఆర్థిక వృద్ధిలో కొత్త శకం.. ఆకాంక్ష నెరవేరే దిశగా ప్రయాణం.. కీలక నివేదికలను పంచుకున్న ప్రధాని మోడీ
PM Narendra Modi
Follow us

|

Updated on: Aug 19, 2023 | 9:23 AM

Economy of India: కరోనా ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థిక రంగంతో కుదేలయ్యాయి. ఆ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని దేశాలు నేటికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. సవాళ్లను పరిష్కరించడానికి మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టింది. దీంతో $2.7 ట్రిలియన్ల GDP తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. భారతదేశం తన ఆర్థిక సవాళ్లను అధిగమించగలిగితే, దాని ఆర్థిక సంస్కరణలను నిలబెట్టుకోగలిగితే 21వ శతాబ్దంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల సామర్థ్యం భారతదేశానికి ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు. ఇటీవల, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మక్కువ ఉన్న వారందరికీ ఆసక్తి కలిగించే రెండు తెలివైన పరిశోధనా భాగాలను తాను చూశానని తెలిపారు. ఒకటి SBI రీసెర్చ్ నుంచి మరొకటి ప్రముఖ జర్నలిస్ట్ అనిల్ పద్మనాభన్ నివేదిక అని తెలిపారు. ఈ విశ్లేషణలు మనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలను సూచిస్తున్నాయన్నారు. సమానమైన, సామూహిక శ్రేయస్సును సాధించడంలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని.. ఈ పరిశోధనల నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశం ఆర్థిక పురోగతి కొత్త శకంలో నిలుస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ప్రధాని మోదీ కొన్ని నివేదికలను ఉదహరించారు.

ఈ మేరకు పీఎం మోడీ పలు విషయాలను లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పలు విషయాలను పంచుకున్నారు. “ఇటీవల, నేను భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మక్కువ ఉన్న వారందరికీ ఆసక్తిని కలిగించే రెండు తెలివైన పరిశోధనా భాగాలను చూశాను: ఒకటి SBI రీసెర్చ్, మరొకటి అనిల్ పద్మనాభన్.. ఈ విశ్లేషణలు మాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయంపై వెలుగునిస్తాయి- భారతదేశం సమానమైన, సామూహిక శ్రేయస్సును సాధించడంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది” అని పోస్ట్‌లో ఉదహరించారు.

“గత 9 సంవత్సరాలలో సగటు ఆదాయం AY14లో రూ. 4.4 లక్షల నుంచి FY23లో రూ. 13 లక్షలకు చేరుకుందని (ఐటీఆర్ రిటర్న్స్ ఆధారంగా) SBI చేసిన పరిశోధన చూపుతోంది. ITR డేటాపై పద్మనాభన్ చేసిన అధ్యయనం వివిధ ఆదాయ బ్రాకెట్లలో పన్ను నిష్పత్తిని విస్తృతం చేస్తుందని సూచిస్తుంది” అని ఈ నివేదికల నుంచి ముఖ్యాంశాలను పంచుకుంటూ ప్రధాని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ పంచుకున్న గణాంకాలు..

ఈ నివేదికల నుంచి అనేక డేటా పాయింట్లను కూడా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ఈ పరిశోధనలు భారతదేశ సమిష్టి కృషిని ప్రతిబింబించడమే కాకుండా ఒక దేశంగా దాని సామర్థ్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు. PM మోడీ పంచుకున్న విషయాల ప్రకారం.. ప్రతి బ్రాకెట్‌లో పన్ను దాఖలులో కనీసం మూడు రెట్లు పెరుగుదల కనిపించింది, కొన్ని దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను కూడా సాధించాయి. “ఇంకా, రాష్ట్రాల అంతటా ఆదాయపు పన్ను దాఖలులో పెరుగుదల పరంగా సానుకూల పనితీరును పరిశోధన హైలైట్ చేస్తుంది. 2014 – 2023 మధ్య ITR ఫైలింగ్‌లను పోల్చినప్పుడు, డేటా అన్ని రాష్ట్రాలలో పెరిగిన పన్ను భాగస్వామ్యానికి సంబంధించిన ఆశాజనక చిత్రాన్ని చిత్రీకరిస్తుంది..” అని మోడీ తెలిపారు.

“ఈ పరిశోధనలు మా సమిష్టి ప్రయత్నాలను ప్రతిబింబించడమే కాకుండా ఒక దేశంగా మన సామర్థ్యాన్ని పునరుద్ఘాటించాయి. అభివృద్ధి చెందుతున్న శ్రేయస్సు దేశ పురోగతికి మంచి సూచన. నిస్సందేహంగా చెప్పాలంటే ఆర్థిక శ్రేయస్సు కొత్త శకం.. శిఖరాగ్ర స్థానంలో ఉన్నాం.. 2047 నాటికి మా కల.. ‘అభివృద్ధి చెందిన భారత్’ను నెరవేర్చుకునే దిశలో ఉన్నాము..” అని మోడీ తెలిపారు.

Economy Of India

Economy Of India

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ఐదు సంకల్పాలు చేశారు.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది, దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది అని తెలిపారు.

India Economy

India Economy

ITR డేటాపై పద్మనాభన్ చేసిన అధ్యయనం ఆదాయ బ్రాకెట్లలో పన్ను స్థావరాన్ని విస్తృతం చేస్తుందని, వాటిలో ప్రతి ఒక్కటి పన్ను దాఖలులో కనీసం మూడు రెట్లు పెరిగాయని, కొన్ని దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను కూడా సాధించాయని PM మోడీ పేర్కొన్నారు. “ఉదాహరణకు, ITR డేటా విశ్లేషణ ITR ఫైలింగ్‌ల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉద్భవించిందని చూపిస్తుంది. జూన్ 2014లో, ఉత్తరప్రదేశ్‌లో 1.65 లక్షల ITR ఫైలింగ్‌లు నమోదయ్యాయి, కానీ జూన్ 2023 నాటికి ఈ సంఖ్య ఆకట్టుకునే విధంగా 11.92 లక్షలకు చేరుకుంది,” అని ప్రధాన మంత్రి చెప్పారు.

చిన్న రాష్ట్రాలు, అది కూడా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, నాగాలాండ్‌లు గత తొమ్మిదేళ్లుగా ఐటీఆర్ ఫైలింగ్‌లలో 20 శాతానికిపైగా మెచ్చుకోదగిన వృద్ధిని కనబరిచాయని ఎస్‌బీఐ నివేదిక ప్రోత్సాహకరంగా ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. “ఆదాయాలు పెరగడమే కాకుండా సమ్మతి కూడా ఉందని ఇది చూపిస్తుంది. మ‌న ప్రజలకు, మ‌న ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం” అని ప్రధాని మోడీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..