AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర.. ఇక వాళ్లది ఫ్లాప్ షోనే: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సహరాన్‌పూర్‌లోని బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్, ఆ పార్టీ కైరానా అభ్యర్థి ప్రదీప్ చౌదరికి మద్దతుగా సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర.. ఇక వాళ్లది ఫ్లాప్ షోనే: ప్రధాని మోదీ
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2024 | 1:57 PM

Share

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఢిల్లీ రోడ్డులోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఓల్డ్ రాధా స్వామి సత్సంగ్ భవన్‌లో సహరాన్‌పూర్‌లోని బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్, ఆ పార్టీ కైరానా అభ్యర్థి ప్రదీప్ చౌదరికి మద్దతుగా సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ తో పొల్చిన ప్రధాని మోదీ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ముస్లిం లీగ్‌లో ఉన్న ఆలోచననే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తిగా ముస్లిం లీగ్ ముద్ర ఉంది. ఈ ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలోని మిగిలిన భాగాలపై వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి..’’ అంటూ ప్రధాని మోదీ విమర్శించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లపై ప్రధాని విరుచుకుపడ్డారు. యూపీకి చెందిన ఇద్దరు కుర్రాళ్ల ఫ్లాప్ సినిమా మళ్లీ విడుదలైందంటూ ఎద్దెవా చేశారు. వాళ్లిద్దరిని ఎవరూ పట్టించుకోరంటూ పేర్కొన్నారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తామంటూ పేర్కొన్నారు. ఇండియా అలయన్స్ కమీషన్ల కోసమేనంటూ పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు.

వీడియో చూడండి..

పదేళ్ల క్రితం సహరన్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీ కోసం వచ్చానని, 2014లో దేశం నిరాశా నిస్పృహలతో సతమతమవుతున్న ఆ రోజును గుర్తుచేసుకుని హామీ ఇచ్చానని మోదీ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రతి పరిస్థితిని మార్చేందుకు కృషిచేశానన్నారు. అప్పట్లో మన భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేదని.. కేవలం 10 ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద శక్తిగా మార్చామన్నారు.

140 కోట్ల మంది దేశప్రజల ఓట్ల బలం వల్లే ప్రపంచంలో భారత్‌ వాణి వినిపిస్తోందని, అందుకే దేశంలోని నలుమూలల నుంచి సమైక్య వాణి వినిపిస్తోందని మోదీ వివరించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొందని.. మరోసారి గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..