Gaganyaan: తిప్పరా మీసం.. గగన్ యాన్కు సిద్ధం.. 2025లో ప్రయోగం.!
సారే జహా సే అచ్ఛా. 1984 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటివరకు ఈ సమాధానమే విన్నాం. నాడు ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ.. సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్ లో 8 రోజులు ఉన్న సంగతిని మనం మర్చిపోలేం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేశ్ శర్మ స్పేస్ నుంచే మాట్లాడారు.

సారే జహా సే అచ్ఛా. 1984 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటివరకు ఈ సమాధానమే విన్నాం. నాడు ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ.. సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్లో 8 రోజులు ఉన్న సంగతిని మనం మర్చిపోలేం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేశ్ శర్మ స్పేస్ నుంచే మాట్లాడారు. ఆ సమయంలో ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపించింది అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? సారే జహా సే అచ్ఛా.. అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మన గుండెల్లో మారుమోగుతోంది. ఇది జరిగిన 40 ఏళ్ల తరువాత మళ్లీ ఆ కల నేరవేరబోతోంది. 40 ఏళ్ల కిందట మన మనిషి భూమిని దాటి స్పేస్లోకి వెళ్లినా ఆ ప్రయాణం సోవియట్ గడ్డ మీద నుంచి మొదలైంది. కానీ మన గడ్డపై నుంచి ఎవరినీ పంపించలేకపోయామన్న ఆవేదన ఇప్పుడు తీరిపోనుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు వ్యోమగాములను దీని కోసం సిద్ధం అవుతున్నారు. వాళ్లు ఎవరెవరో తెలుసా? మన ఎయిర్ ఫోర్స్కు చెందిన నలుగురు పైలెట్లు. గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్.. వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను త్వరలో అంతరిక్షంలోకి తీసుకెళ్లే...