PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi: అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి నూతన పార్లమెంట్‌ భవన పనులను..

PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Sep 27, 2021 | 2:36 AM

PM Modi: అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి నూతన పార్లమెంట్‌ భవన పనులను పరిశీలించారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి జరుగుతున్న పనులపై మోదీ ఆరా తీశారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండియా గేట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు జరుగుతున్న నిర్మాణాలు, సుందరీకరణ పనులను మోదీ పరిశీలించారు.

Modi 1

కాగా, డిసెంబర్‌ 10, 2020న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణం అవుతోంది. 2022 నాటికి పూర్తి కానుంది. ఈ భవనంలో లోక్‌సభలో 888 మంది ఎంపీలకు, రాజ్యసభలో 384 మంది ఎంపీలకు కేటాయించనున్నారు. ఈ భవనంలో 1,382 మంది ఉండేందుకు నిర్మాణం జరుగుతోంది.

Modi 3

భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పనులు కొనసాగుతున్న తీరుపై మోదీ ఆరా తీశారు. కాగా, కొత్త పార్లమెంటు భవనం సైట్‌ను మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.238 కోట్లు, సెంటర్ విస్టా అవెన్యూ పునర్నిర్మాణానికి రూ. 63 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు ప్రాజెక్టులకు అయ్యే అంచనా వ్యయాలు రూ. 1,289 కోట్లు.

గత ఏడాది డిసెంబర్‌లో కొత్త పార్లమెంటుకు పునాది రాయి వేస్తూ, కొత్త భవనం 21 వ శతాబ్దపు దేశ ఆకాంక్షలను నెరవేరుస్తుందని, అదే విధంగా కొత్త, పాత సహజీవనంకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇప్పుడు పదవీ విరమణ చేయాలని చూస్తోంది. 21 వ శతాబ్దపు భారతదేశానికి కొత్త పార్లమెంటు భవనాన్ని ఇవ్వడం మనందరి బాధ్యత అని మోదీ అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కొత్త పార్లమెంటుకు పునాది రాయి వేస్తూ, కొత్త భవనం 21 వ శతాబ్దపు దేశ ఆకాంక్షలను నెరవేరుస్తుందని, అదే విధంగా కొత్త, పాత సహజీవనంకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇప్పుడు పదవీ విరమణ చేయాలని చూస్తోంది. 21 వ శతాబ్దపు భారతదేశానికి కొత్త పార్లమెంటు భవనాన్ని ఇవ్వడం మనందరి బాధ్యత అని మోదీ అన్నారు.

ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు భవనానికి న్యూదిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ డిజైన్ చేశారు. ఈ భవనానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. అప్పట్లో దీనికి రూ. 83 లక్షల వరకు వ్యయం అయ్యింది. దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు.

ఇవీ కూడా చదవండి:

PM Narendra Modi: బడలిక ఎరుగని ప్రధాని మోడీ.. అలసట దరిచేరక పోవడానికి రహస్యం ఇదే!

Punjab New Cabinet: పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో చేరిన 15 మంది!