AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.100 రిఫండ్‌కు ఫోన్ కొట్టి.. వేల రూపాయలు పొగొట్టుకున్నాడు..!

ఈ హైటెక్ యుగంలో మోసాలు కూడా హైటెక్‌గానే ఉంటున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు కూడా పొగుట్టుకుంటున్నారు బాధితులు. సాధారణంగా ఏటీఎం కార్డుల వివరాల గురించి ట్రాప్ చేసి బొల్తా కొట్టించే బ్యాచ్ ఒకటైతే.. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లు పెడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నది మరో బ్యాచ్. అలాంటి ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఘటన ఒకటి బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించి.. అక్షరాల రూ. 77 వేలను […]

రూ.100 రిఫండ్‌కు ఫోన్ కొట్టి.. వేల రూపాయలు పొగొట్టుకున్నాడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 23, 2019 | 9:17 PM

Share

ఈ హైటెక్ యుగంలో మోసాలు కూడా హైటెక్‌గానే ఉంటున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు కూడా పొగుట్టుకుంటున్నారు బాధితులు. సాధారణంగా ఏటీఎం కార్డుల వివరాల గురించి ట్రాప్ చేసి బొల్తా కొట్టించే బ్యాచ్ ఒకటైతే.. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లు పెడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నది మరో బ్యాచ్. అలాంటి ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఘటన ఒకటి బీహార్‌లో వెలుగులోకి వచ్చింది.

వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించి.. అక్షరాల రూ. 77 వేలను పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. పట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విష్ణు అనే ఓ ఇంజినీర్‌ సెప్టెంబరు 10న ఆన్‌లైన్ ఫుడ్ ఆప్ జొమాటోలో ఓ ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే డెలవరీ బాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన ఐటమ్‌ను విష్ణుకు అందజేశాడు. అయితే ఫుడ్ బాగులేకపోవడంతో విసుగు చెందిన విష్ణు.. రిటర్న్ తీసుకెళ్లమని డెలివరీ చేసిన బాయ్‌ను కోరాడు. ఇందుకు తిరస్కరించిన ఆ బాయ్.. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయమంటూ సలహా ఇచ్చాడు.

డెలివరీ బాయ్ సలహాతో జోమాటో కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సర్చ్ చేశాడు. దీంతో అతడికి టాప్‌లో ఓ కస్టమర్ కేర్ నంబర్ కనిపించింది. దీంతో అదే నిజమైన నంబర్ అనుకుని కాల్ చేశాడు. అయితే నిజానికి అది జోమాటో కస్టమర్ కేర్ నంబర్ కాదు. ఈ విషయం తెలియని బాధితుడు విష్ణు ఆ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే అవతలి వ్యక్తి కూడా.. తాను జొమాటో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అని, ఫుడ్ బాగాలేనందుకు రూ.100 రీఫండ్‌ ఇస్తామని చెప్పాడు. అయితే ఇందుకోసం రూ.10 డిపాజిట్‌ చేయాలని అన్నాడు. అనంతరం ఆ వ్యక్తి బాధితుడి విష్ణు నంబరుకు ఓ లింక్‌ పంపాడు. ఆ లింక్‌ క్లిక్ చేసి.. విష్ణు తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.10 జమ చేశాడు. అయితే కాసేపటికే విష్ణు ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.77వేలు మాయమయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన విష్ణు.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సైబర్‌ కేసు నమోదు చేశారు. ఆప్‌లో ఉన్న నంబర్లు కాకుండా ఇలా గూగుల్‌లో ఉన్న నంబర్లను పరీశిలించకుండా చేస్తే.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.