AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్రమంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్యల‌కు కూడా దిగింది.

పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!
Operation Sindoor In Pakistan
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2025 | 2:46 AM

భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్రమంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్యల‌కు కూడా దిగింది. దీంతో భార‌త్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భార‌త్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాల‌న్నది పాక్ ప‌న్నాగం. కానీ, ప్రధాని మోదీ మాత్రం పాక్‌కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప‌క్కా వ్యూహంతో దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

భారత్ చేసింది యుద్ధ చర్య అంటూ గగ్గోలు పెడుతుంది పాకిస్తాన్‌. భారత్ పై ప్రతీకారం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సరైన సమయంలో సమాధానం ఇస్తామంటూ పాక్ ప్రగల్భాలు పలుకుంది. నిన్నంతా పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వరుస మీటింగ్‌లు పెట్టి హడావుడి చేశారు. కానీ పాక్ ప్రధాని టీమ్‌ అంతా డీలాపడి కూర్చుంది. భారత్‌తో పెట్టుకుంటే రియాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో పాక్‌ పాలకులకు అర్ధం కావడంతో వణికిపోతున్నారు. యుద్ధం ఆలోచన చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు.

భార‌త్‌ను ఏకాకిని చేయాల‌ని కుట్ర పన్నిన పాకిస్తానే ఇప్పుడు ఒంటరి అయింది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం కూడా..ఉగ్రవాదాన్ని స‌మ‌ర్థించే ప‌రిస్థితి లేదు. అందుకే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావ‌రాల‌పై ప‌క్కా లెక్కతో దాడుల చేసింది భారత్‌. దీనిని ప్రపంచం కూడా హర్షించింది. ఇప్పుడు పాక్‌కు వాయిస్ లేకుండా పోయింది. అక్కడ ధ్వంస‌మైన‌వి ఏంటి? అంటే.. ఉగ్రవాద శిబిరాలే.. ఇక్కడ ప్రపంచ మ‌ద్దతు భార‌త్ కే ఉంది. ఈ సమయంలో చైనా సహా ఏ ఒక్క దేశమూ పాకిస్థాన్‌కు అండగా నిలవలేదు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు ఎలాంటి మద్దతు లేదు. దీంతో దాయాది ఒంటరి అయ్యింది.

ఈ దాడులకు సంబంధించి లైవ్‌లో వార్తలు చదువుతున్న పాకిస్థాన్ కు చెందిన ఓ యాంకర్ లైవ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ కావడంతో ఉగ్రవాదులు చనిపోతే ఏడుస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు పాకిస్తాన్‌ పాలకులపై అక్కడి ప్రజలకు నమ్మకం లేదు. భారత్‌ మళ్లీ దాడి చేస్తే ఎదుర్కొనే సత్తా అక్కడ ఎవరికి లేదని వారికి బాగా తెలుసు. అందుకే ఎక్కడ యుద్ధం వస్తుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అంతే కాకుండా మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్‌ పాలకులకు, ఆ దేశ ప్రజలకు నిద్రలేకుండా పోయింది.

ఆపరేషన్ సింధూర్ తరువాత, పాకిస్తాన్ నుండి ఇటువంటి వీడియోలు వస్తున్నాయి. అక్కడ భయం స్పష్టంగా కనిపిస్తుంది. బయటపడిన వీడియోలో, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భయానక వాతావరణం కనిపిస్తోంది. సాధారణ ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లి అన్ని లైట్లు ఆపివేయమని ప్రకటనలు చేస్తున్నారు. పిల్లలను ఇళ్లలోనే ఉండమని సూచిస్తున్నారు. ఒకవైపు, ఈ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మరోవైపు, భయం మరియు భీతి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..