AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి […]

ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 25, 2020 | 9:49 PM

Share

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నాలో దీనికి సంబంధించిన కథనం ప్రచురించింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టంలో లోపాలున్నాయంటూ వేలెత్తి చూపుతూనే.. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.

పాక్, బంగ్లాకు చెందిన ముస్లింలను దేశం నుంచి పంపించాల్సిందేనని.. అందులో ఎలాంటి సదేహం లేదని ఆ పత్రికలో పేర్కొంది. ఇక శివసేన పార్టీ జెండా ఎప్పటికీ కాషాయ రంగులోనే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు హిందుత్వ కోసం శివసేన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని.. అయితే కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ చట్టంలో కొన్ని లోపాలున్నాయంటూ పేర్కొంది. ఈ సందర్భంగా అటు పార్టీ జెండా రంగును మార్చుకున్న మహానరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)పై నిప్పులు చెరిగింది. బీజేపీ డైరక్షన్‌లో ఎంఎన్ఎస్ నడుస్తోందని.. బీజేపీ లాగే కేవలం ఓట్ల కోసమే జెండా రంగును కాషాయం చేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్‌థాక్రే.. ఇప్పుడు ఓట్ల కోసం పార్టీ జెండా రంగులు మార్చారంటూ విరుచుకుపడింది. కాగా, సీఏఏలో ఉన్న లోపాలతో ముస్లింలే కాకుండా.. కొందరు హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ పేర్కొనడం గమనార్హం.

Follow Us
మల్లన్న భక్తులకు రైల్వే వరం.. అందుబాటులోకి కొమురవెల్లి స్టేషన్!
మల్లన్న భక్తులకు రైల్వే వరం.. అందుబాటులోకి కొమురవెల్లి స్టేషన్!
15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ..
15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ..
రూ.2 లక్షలు తగ్గిన వెండి ధర.. ఆల్ టైమ్ రికార్డ్‌తో పోలిస్తే..
రూ.2 లక్షలు తగ్గిన వెండి ధర.. ఆల్ టైమ్ రికార్డ్‌తో పోలిస్తే..
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
కాన్వాయ్ ఆపి.. ప్రాణం కాపాడిన మంత్రి!
కాన్వాయ్ ఆపి.. ప్రాణం కాపాడిన మంత్రి!
రేషన్‌కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. 7 కిలోల బియ్యం!
రేషన్‌కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. 7 కిలోల బియ్యం!
విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? నటి కన్నీళ్లు
విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? నటి కన్నీళ్లు
బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలుసుకోండి
బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలుసుకోండి
వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ తో మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!
వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ తో మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!