ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి […]

ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!
Follow us

| Edited By:

Updated on: Jan 25, 2020 | 9:49 PM

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నాలో దీనికి సంబంధించిన కథనం ప్రచురించింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టంలో లోపాలున్నాయంటూ వేలెత్తి చూపుతూనే.. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.

పాక్, బంగ్లాకు చెందిన ముస్లింలను దేశం నుంచి పంపించాల్సిందేనని.. అందులో ఎలాంటి సదేహం లేదని ఆ పత్రికలో పేర్కొంది. ఇక శివసేన పార్టీ జెండా ఎప్పటికీ కాషాయ రంగులోనే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు హిందుత్వ కోసం శివసేన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని.. అయితే కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ చట్టంలో కొన్ని లోపాలున్నాయంటూ పేర్కొంది. ఈ సందర్భంగా అటు పార్టీ జెండా రంగును మార్చుకున్న మహానరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)పై నిప్పులు చెరిగింది. బీజేపీ డైరక్షన్‌లో ఎంఎన్ఎస్ నడుస్తోందని.. బీజేపీ లాగే కేవలం ఓట్ల కోసమే జెండా రంగును కాషాయం చేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్‌థాక్రే.. ఇప్పుడు ఓట్ల కోసం పార్టీ జెండా రంగులు మార్చారంటూ విరుచుకుపడింది. కాగా, సీఏఏలో ఉన్న లోపాలతో ముస్లింలే కాకుండా.. కొందరు హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ పేర్కొనడం గమనార్హం.

Latest Articles
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!