AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ బీజేపీకి భారీ షాక్‌.. ఓ వైపు ఈసీ దెబ్బ.. మరో వైపు…

ఢిల్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓ వైపు అధికార ఆప్.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరిశరణ్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. హరిశరణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు బీజేపీ […]

ఢిల్లీ బీజేపీకి భారీ షాక్‌.. ఓ వైపు ఈసీ దెబ్బ.. మరో వైపు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 12:56 PM

Share

ఢిల్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓ వైపు అధికార ఆప్.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరిశరణ్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. హరిశరణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన స్థానంలో తజీందర్ పాల్ సింగ్ బగ్గాకి సీటు కేటాయించారు. దీంతో అసహనానికి గురైన హరిశరణ్.. బీజేపీ గుడ్‌బై చెప్పి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరిశరణ్ మీడియాతో మాట్లాడుతూ… కేజ్రీవాల్ ఢిల్లీని ఓ అమ్మలా పాలిస్తున్నారని కొనియాడారు. విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసుకున్నారని.. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ వద్ద ఓ మంచి రూట్‌మ్యాప్ ఉందన్నారు.

ఇదిలా ఉంటే.. అత్యంత కీలక సమయంలో బీజీపీ అభ్యర్ధికి ఈసీ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5.00 గంటల నుంచి 48 గంటల పాటు.. ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టులు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఢిల్లీలో జరిగేది భారత్ వర్సెస్ పాకిస్థాన్ అంటూ పోస్ట్ చేయడంతో.. ఆప్ ఈసీని ఆశ్రయించింది. ట్వీట్ వివాదాస్పదం కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేశారు.

Follow Us
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
ఏపీలో థర్డ్ ఫ్రంట్ రాబోతుందా.. టీవీ9తో పీవీ సునీల్
ఏపీలో థర్డ్ ఫ్రంట్ రాబోతుందా.. టీవీ9తో పీవీ సునీల్
పవన్ కల్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు.. టీవీ9 ఇంటర్వ్యూలో P.V సునీల్
పవన్ కల్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు.. టీవీ9 ఇంటర్వ్యూలో P.V సునీల్
సస్పెన్షన్ నాకు పనిష్మెంట్ కాదు.. TV9 క్రాస్‌ఫైర్‌లో..
సస్పెన్షన్ నాకు పనిష్మెంట్ కాదు.. TV9 క్రాస్‌ఫైర్‌లో..
నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఆ ఆరోపణలపై..
నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఆ ఆరోపణలపై..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట